
బంగారు భవిష్యత్తుకుప్రభుత్వ బడుల్లో చేర్పించండి
డీఈఓ శ్రీనివాస్రెడ్డి
సిద్దిపేటరూరల్: ‘ప్రభుత్వ పాఠశాలల్లో నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్య అందుతోందని జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్రెడ్డి అన్నారు. శనివారం మండల పరిధిలోని బుస్సాపూర్లో నిర్వహించిన బడిబాటలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులు వారి పిల్లల బంగారు భవిష్యత్తుకు ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని అన్నారు. వారానికి 3 సార్లు గ్రుడ్లతో కూడిన పౌష్టికాహారం, ఉదయం సమయాల్లో రాగిజావ అందించడమే కాకుండా విశాలమైన ఆటస్థలం, సైన్స్, కంప్యూటర్ల్యాబ్లు వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఎంఈఓ రాజిరెడ్డి, కాంప్లెక్స్ హెచ్ఎం శ్రీనివాస్, పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
వ్యాయామంతో
సంపూర్ణ ఆరోగ్యం
జిల్లా ఇంటర్ విద్యాధికారి రవీందర్రెడ్డి
సిద్దిపేట ఎడ్యుకేషన్: వ్యాయామంతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని, జిల్లా ఇంటర్ విద్యాధికారి రవీందర్రెడ్డి అన్నారు. సిద్దిపేట రన్నర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 27న జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న ఆఫ్ మారథాన్ రన్నింగ్ పోటీల వాల్ పోస్టర్ను స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండేందుకు ఉదయం నడకతో పాటు రన్నింగ్ చేయాలని సూచించారు. రన్నింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రన్నింగ్ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరూ పోటీల్లో పాల్గొని ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. అసోసియేషన్ అధ్యక్షుడు రాజు మాట్లాడుతూ 5కె, 10కె, 21కె (ఆఫ్ మారథాన్) పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు 9885886368 నంబర్లో సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాస్, సత్యనారాయణ రెడ్డి, తెలంగాణ గెజిటెడ్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కనకచంద్రం తదితరులు పాల్గొన్నారు.
మాజీ దళ నాయకుడు మృతి
కొండపాక(గజ్వేల్): పీపుల్స్వార్ గిరాయి పల్లి మాజీ దళ నాయకుడు కోటగల్ల పోశయ్య(66) ఎలియాస్ రాజన్న శుక్రవారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందాడు. మర్పడ్గ మధిర నాగిరెడ్డిపల్లికి చెందిన పోశయ్య 40 ఏళ్ల కిందట పీపుల్స్ వార్ దళంలో సభ్యునిగా చేరాడు. అంచెలంచెలుగా ఎదుగుతూ 1987లో దళ నాయకుడిగా ఎన్నికయ్యారు. ఈ హోదాలో మూడేళ్ల పాటు పని చేశారు. తరువాత హైదరాబాద్లో కొరియర్గా పని చేస్తున్న క్రమంలో అనారోగ్యానికి గురై పోలీసులకు లొంగిపోయారు. దళ నాయకుడిగా పని చేసిన రోజుల్లో భూస్వాముల, పెత్తందారుల ఆగడాలపై, ప్రజా సమస్యల పరిష్కారంపై పోరాటం చేశారు.

బంగారు భవిష్యత్తుకుప్రభుత్వ బడుల్లో చేర్పించండి