ముందస్తు పత్తి విత్తు | - | Sakshi
Sakshi News home page

ముందస్తు పత్తి విత్తు

Jun 8 2025 7:18 AM | Updated on Jun 8 2025 7:18 AM

ముందస

ముందస్తు పత్తి విత్తు

భారీ వర్షాల కోసం ఎదురుచూపు
● నైరుతి రాకతో పదిహేను రోజుల నుంచే విత్తన ప్రక్రియ ● సాగు అంచనా 1.11లక్షల ఎకరాలు ● అంతా నల్లరేగడి భూముల్లోనే.. ● మద్దతు ధర పెంపుతో పెరగనున్నసాగు విస్తీర్ణం

జిల్లాలో పత్తి విత్తనాలు ముందస్తుగా వేసే ప్రక్రియ జోరుగా సాగుతోంది. నైరుతి రాకతో పదిహేను రోజుల నుంచే నల్లరేగడి భూముల్లో పత్తి విత్తన ప్రక్రియ జోరందుకుంది. నిజానికి ప్రస్తుత వానాకాలం సీజన్‌కు సంబంధించి భారీ వర్షం కురవకపోయినా, నల్ల రేగడి భూములు బెట్టను తట్టుకునే అవకాశమున్నందువల్ల ఈ భూముల్లో మొదటగా పత్తిని విత్తుకుంటున్నారు. సహజంగా ఏటా ఇదే జరుగుతుండగా, ఈసారి ఈ పరిస్థితి మరింతగా ఊపందుకుంది. కొన్ని రోజులుగా వర్షాలు ముఖం చాటేయంతో తాము వేసిన విత్తనం మొలుస్తుందో లేదోనన్న ఆందోళన రైతులను వెంటాడుతోంది.

గజ్వేల్‌: జిల్లాలో ప్రస్తుత వానాకాలానికి సంబంధించి 5.50లక్షల ఎకరాలకుపైగా వివిధ రకాల పంటలు సాగులోకి వస్తాయని వ్యవసాయశాఖ అంచనా వేస్తున్నది. ఇందులోభాగంగానే పత్తి 1.11లక్షల ఎకరాల్లో సాగులోకి వస్తుందని భావిస్తున్నారు. గతేడాది 1.04లక్షల ఎకరాల్లో మాత్రమే సాగులోకి వచ్చిన ఈ పంట ఈసారి గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే అంచనా విస్తీర్ణంలో ఇప్పటికే సుమారుగా 30శాతానికిపైగా అంటే 35వేల ఎకరాల్లో పత్తి సాగులోకి వచ్చిందని అంచనా. ఇంకా విస్తారంగా వానలు కురవలేదు. నైరుతి రావడంతో మే మూడో వారం నుంచే పత్తి విత్తనాలు వేస్తున్నారు. ప్రత్యేకించి నల్లరేగడి భూముల్లో విత్తనాలు జోరుగా వేస్తున్నారు. వర్షాలు కాస్తా లేటయినా భూములు బెట్టను తట్టుకునే అవకాశమున్నందువల్ల పత్తి విత్తన ప్రక్రియ జోరుగా సాగుతోంది.

మద్దతు ధర పెంపుతో..

గతేడాదితో పోలిస్తే ఈసారి పత్తి సాగు గణనీయంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ఈసారి పత్తికి మద్దతు ధర రూ.8,110ను ప్రకటించింది. ఇందులో మీడియం స్టేపుల్‌కు రూ.7,710, లాంగ్‌ స్టేపుల్‌కు రూ.8,110ధరగా నిర్ణయించిన సంగతి తెల్సిందే. గతేడాదితో పొలిస్తే రూ.580 అదనం. దీంతో రైతులు పత్తివైపు మొగ్గు చూపుతున్నారు. మరోవైపు అనావృష్టి ఏర్పడే సందర్భంలో బెట్ట పరిస్థితులను తట్టుకునే విత్తన రకాలు పత్తిలో ఎక్కువగా అందుబాటులోకి రావడం వల్ల కూడా రైతులు ఈ పంట వైపు మొగ్గుచూపుతున్నారు. పత్తిని సాగు చేస్తే పెట్టుబడులు పోనూ ఎంతో కొంత మిగులుబాటు ఉంటుందని భావన రైతుల్లో వ్యక్తమవుతోంది.

రైతులు తొందరపడొద్దు

భూమిలో సమృద్ధిగా పదును వచ్చిన తర్వాతే పత్తి విత్తనాలు వేసుకోవడం మంచిది. లేనిపక్షంలో రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది. రైతులు ఇప్పటికై నా తొందరపడకుండా భారీ వర్షాలు వచ్చాకే విత్తనం వేసుకోవాలి.

– రాధిక, జిల్లా వ్యవసాయాధికారి

భక్తిశ్రద్ధలతో బక్రీద్‌

వానల కోసం..

జిల్లాలో మే నెలకు సంబంధించి 23.1మి.మీల సాధారణ వర్షపాతానికి 138.9మి.మీల వర్షపాతం నమోదయ్యింది. జూన్‌ నెలలో 95.9మి.మీల సాధారణ వర్షపాతానికి ఇప్పటివరకు కేవలం 3.3మి.మీల వర్షపాతం మాత్రమే నమోదయ్యింది. మే రెండు, మూడో వారాల్లో కురిసిన వర్షాలకు రైతులు పత్తి విత్తనాలను వేయడం ప్రారంభించారు. విత్తనాలు వేసిన తర్వాత పది రోజులగాకుపైగా వర్షాలు ముఖం చాటేయడంతో, వేసిన విత్తనం మొలుస్తుందో లేదోనని రైతుల్లో కలవరం మొదలైంది. భారీ వర్షాలు కురుస్తేనే రైతుల దిగులుకు తెరపడే అవకాశం ఉంది.

ముందస్తు పత్తి విత్తు 1
1/2

ముందస్తు పత్తి విత్తు

ముందస్తు పత్తి విత్తు 2
2/2

ముందస్తు పత్తి విత్తు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement