జీతం.. మహాప్రభో | - | Sakshi
Sakshi News home page

జీతం.. మహాప్రభో

Jun 5 2025 8:12 AM | Updated on Jun 5 2025 8:12 AM

జీతం.

జీతం.. మహాప్రభో

● వేతనాల కోసం కాంట్రాక్టు ఉపాధ్యాయుల నిరీక్షణ ● నాలుగు నెలలుగా అందక వెతలు

చేర్యాల(సిద్దిపేట): వారంతా 2008 డీఎస్సీలో అర్హత సాధించారు. కానీ పోస్టింగ్‌ రావడంలో ఆలస్యమైంది. 16 ఏళ్ల పోరాటం తర్వాత ఎట్టకేలకు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ప్రభుత్వం కాంట్రాక్టు పద్ధతిలో విధుల్లోకి తీసుకుంది. ప్రభుత్వమే నేరుగా వేతనాలు చెల్లిస్తుంది కనుక ఆర్థిక భరోసా ఉంటుందని నమ్మిన ఆ ఉపాధ్యాయులు ఉద్యోగంలో చేరారు. అయితే చేరి నాలుగు నెలలు గడిచినా వేతనాలు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 50 మంది 2008 డీఎస్సీ అభ్యర్థులు ఈ ఏడాది ఫిబ్రవరి 15న విధుల్లో చేరారు. విద్యాశాఖ అధికారులు వారిని వివిధ పాఠశాలలకు కేటాయించగా పాఠాలు బోధిస్తున్నారు. ఇది ఇలా ఉంటే ప్రభుత్వం నియమించిన ఉపాధ్యాయులకు ఇప్పటి వరకు ఒక్క నెల జీతం కూడా ఇవ్వలేదు. కానీ విద్యా సంవత్సరం చివరి రోజునే ఆ ఉపాధ్యాయులను టెర్మినేట్‌ చేసింది విద్యాశాఖ. టెర్మినేషన్‌లో చొరవ చూపిన విద్యాశాఖ అదికారులు, ప్రభుత్వం వేతనాల చెల్లింపు విషయంలో మాత్రం జాప్యం చేయడం విమర్శలకు తావిస్తోంది. ఇంకో వారం రోజుల్లో బడులు తెరుస్తారు. ఇప్పటికైనా పాత జీతాలు చెల్లిస్తే బాగుంటుందని వారు కోరుతున్నారు.

పోషణ కష్టంగా ఉంది

పదహారేళ్ల నిరీక్షణ తర్వాత ఎంతో ఆశతో ఉద్యోగంలో చేరాం. కానీ నాల్గు నెలలుగా వేతనాలు చెల్లించక పోవడంతో కుటుంబం గడవడం కష్టమవుతోంది. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం. టెర్మినేట్‌ చేసి వేతనాలు ఇవ్వకపోయినా నిబద్దతతో ఇటీవల ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యాం. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి వెంటనే వేతనాలు చెల్లించాలి. –పోతుగంటి శ్రావణ్‌కుమార్‌,

ఎంపీపీఎస్‌, కాశగుడిసెలు

వేతనాలివ్వాలి

ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందన్న ఆనందంతో చేరాను. కానీ నాలుగు నెలలు గడిచినా వేతనాలు ఇవ్వలేదు. మమ్ములను మాత్రం ఏప్రిల్‌ 23న టెర్మినేట్‌ చేశారు. మిగతా కాంట్రాక్టు ఉద్యోగులను టెర్మినేట్‌ చేసిన మూడు రోజుల్లో విధుల్లోకి తీసుకున్నారు. ప్రభుత్వం మా ఆవేదనను అర్థం చేసుకుని వేతనాలు చెల్లించాలి.

–కె.రమాదేవి, ఎంపీయూపీఎస్‌, వల్లంపట్ల

పెండింగ్‌లో ఉన్నాయి

2008 డీఎస్సీ కాంట్రాక్టు ఉపాధ్యాయుల వేతనాల అంశం రాష్ట్రస్థాయిలో ఉంది. జిల్లా వ్యాప్తంగా 50 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరందరికి నాలుగు నెలలుగా వేతనాలు రాలేదు. ఆర్థిక శాఖ పరిధిలో ఫైలు ఉంది. త్వరలో వస్తాయి.

– శ్రీనివాస్‌రెడ్డి, డీఈఓ

జీతం.. మహాప్రభో 1
1/3

జీతం.. మహాప్రభో

జీతం.. మహాప్రభో 2
2/3

జీతం.. మహాప్రభో

జీతం.. మహాప్రభో 3
3/3

జీతం.. మహాప్రభో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement