ప్రజాసమస్యలపై నిరంతర పోరాటం | - | Sakshi
Sakshi News home page

ప్రజాసమస్యలపై నిరంతర పోరాటం

Jun 5 2025 8:12 AM | Updated on Jun 5 2025 8:12 AM

ప్రజాసమస్యలపై నిరంతర పోరాటం

ప్రజాసమస్యలపై నిరంతర పోరాటం

● అంతరాలు లేని సమాజ నిర్మాణమే లక్ష్యం ● సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్‌ ● గజ్వేల్‌లో సీపీఐ మహాసభలు

గజ్వేల్‌: ప్రజా సమస్యలపై నిరంతర పోరాటాలను కొనసాగిస్తామని సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్‌ అన్నారు. బుధవారం స్థానిక కోలాఅభిరామ్‌ గార్డెన్స్‌లో మండల స్థాయి 17వ మహాసభ జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంద పవన్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీడితుల పక్షాన పోరాడుతున్న కమ్యూనిస్టులపై, మేధావులపై ఉప చట్టాలను ప్రయోగించి జైళ్లల్లో నిర్బంధిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మతం పేరుతో దేశంలో అశాంతిని సృష్టిస్తున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతాల్లో నిక్షిప్తమై ఉన్న అపారమైన ఖనిజ సంపదను కార్పొరేట్ల పరం చేయడానికి కేంద్రం కుట్రలు చేస్తున్నదని ఆరోపించారు. ఇందులోభాగంగానే ‘ఆపరేషన్‌ కగార్‌’ను అమలుచేస్తున్నారని మండిపడ్డారు. సీపీఐ అంతరాలు లేని సమాజ నిర్మాణం కోసం నిరంతరం పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. మహాసభల్లో సీపీఐ గజ్వేల్‌ మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు. మహాసభకు ముందు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement