జొన్న కొనుగోళ్లు పూర్తి | - | Sakshi
Sakshi News home page

జొన్న కొనుగోళ్లు పూర్తి

May 31 2025 6:54 AM | Updated on May 31 2025 6:54 AM

జొన్న

జొన్న కొనుగోళ్లు పూర్తి

● నేటితో కేంద్రాలు మూసివేత ● మిగిలిన రైతులకు నేడు అవకాశం

నారాయణఖేడ్‌: జొన్నల కొనుగోళ్లను ఈ నెల 31వ తేదీతో ముగిస్తున్నారు. గత నెల మూడో వారంలో జొన్న కొనుగోళ్లను ప్రారంభించగా చివరి వారంలో కొనుగోళ్లు జోరందుకున్నాయి. ఇప్పటివరకు జిల్లాలో 22 కేంద్రాల ద్వారా 12,581మంది రైతుల వద్ద 6,01,330 బస్తాల్లో 30,066.5మెట్రిక్‌ టన్నుల జొన్నలను కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన రైతులకు రూ.101, 35,41,715 కోట్లను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది.

14 క్వింటాళ్ల కొనుగోలుకు అనుమతి

జిల్లాలోని ఆయా కేంద్రాల్లో జొన్నల కొనుగోళ్లు దాదాపు శుక్రవారం సాయంత్రంతో ముగిశాయి. కాగా, మిగిలిన రైతులు ఈనెల 31వ తేదీ శనివారం సాయంత్రం 5గంటల లోపు సమీప కేంద్రాలకు తరలిస్తే కొనుగోళ్లు చేపట్టనున్నారు. ప్రభుత్వం మొదట ఎకరాకు 8 క్వింటాళ్ల మేర కొనుగోళ్లు చేసేందకు అనుమతించింది. కాగా, ఎకరాకు 20 క్వింటాళ్ల వరకు దిగుబడులు వచ్చాయని, కొనుగోళ్ల సామర్థ్యాన్ని పెంచాలని అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రభుత్వానికి చేసిన సిఫారసు మేరకు 14 క్వింటాళ్ల కొనుగోలుకు అనుమతిచ్చారు. ప్రభు త్వం క్వింటాలుకు రూ.3,371మద్దతు ధర చెల్లించి కొనుగోళ్లు చేపట్టింది. బయటి మార్కెట్‌లో జొన్నలు క్వింటాలు రూ.2వేల నుంచి రూ.2,200లోపే పలుకుతోంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మద్దతు ధర లభించడంతో రైతులు కేంద్రాల్లోనే తమ పంట ఉత్పత్తులను అమ్ముకున్నారు.

రూ.101.35కోట్ల పంట సేకరణ

జిల్లాలో మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో నిజాంపేట్‌, సదాశివపేట్‌, నాగల్‌గిద్ద, కల్హేర్‌, మార్డి, సంజీవన్‌రావుపేట్‌, బాచేపల్లి, బీబీపేట్‌, బొక్కస్‌గాం, చెల్మెడ కలాన్‌, ఏడాకులపల్లి, గంగాపూర్‌, ఝరాసంగం, కడ్పల్‌, కంగ్టి, ఖాదిరాబాద్‌, కొండాపూర్‌, మనూరు, మరేపల్లి, నల్లంపల్లి, న్యాల్‌కల్‌, సత్వార్‌ గ్రామాల్లో కలిపి మొత్తం 22 కేంద్రాలను పీఏసీఎస్‌, డీసీఎంఎస్‌, ఐకేపీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల ద్వారా 12,581మంది రైతుల వద్ద 30,066,5మెట్రిక్‌ టన్నుల మేర జొన్నలను కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన జొన్నల రైతులకు ప్రభుత్వం రూ.101,35,41,715 కోట్ల మేర చెల్లించాల్సి ఉంది. ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో ఇంకా డబ్బులు జమకాలేదు.

నేటితో కేంద్రాలు క్లోజ్‌

జిల్లాలోని అన్ని జొన్నల కొనుగోలు కేంద్రాలను ఈనెల 31వ తేదీతో మూసివేస్తున్నాం. మిగిలిపోయిన రైతులు ఎవరైనా ఉంటే శనివారం సాయంత్రం 5గంటల లోపు కేంద్రాలకు తెచ్చి విక్రయించుకోవచ్చు.

– శ్రీదేవి, మార్క్‌ఫెడ్‌ జిల్లా

మేనేజర్‌, సంగారెడ్డి

జొన్న కొనుగోళ్లు పూర్తి1
1/1

జొన్న కొనుగోళ్లు పూర్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement