
మెడికల్ కాలేజీకి తాళం
క్యాబ్.. క్యా సాబ్! మండుతున్న ఎండలతో పాటు క్యాబ్లు, ఆటోలు ప్రయాణికులను ఠారెత్తిస్తున్నాయి.
8లోu
ఇబ్రహీంపట్నం రూరల్: అద్దె చెల్లించలేదనే కారణంతో మహేశ్వరం ప్రభుత్వ మెడికల్ కళాశాలకు తాళం వేశారు. దీంతో విద్యార్థులు, అధ్యాపకులు గంటల తరబడిగా ఆరుబయటే నిరీక్షించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. ఆదిబట్ల మున్సిపల్ పరిధి మంగళ్పల్లిలోని భారత్ ఇంజనీరింగ్ కళాశాలలో మహేశ్వరం ప్రభుత్వ మెడికల్ కళాశాల కొనసాగుతోంది. గతేడాది అక్టోబర్లో కాలేజీని ప్రారంభించారు. ఈ సమయంలో నెలకు రూ.16 లక్షల చొప్పున అద్దె చెల్లించేలా భవన యాజమాన్యం ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. కానీ బిల్డింగ్ నిర్మాణ పనులు పూర్తి కాకకపోవడంతో, ఇదే ప్రాంగణంలోని మరో భవనంలో మెడికల్ కాలేజీతో పాటు తరగతులు నిర్వహిస్తున్నారు. సోమవారం క్లాసులు ముగిసిన అనంతరం భవన యజమానులు గదులకు తాళాలు వేసుకున్నారు. మెడికల్ కాలేజీ బోర్డును సైతం తొలగించారు. మంగళవారం ఉదయం కాలేజీకి వచ్చిన సిబ్బంది, విద్యార్థులు గదులకు తాళాలు, పక్కన పడేసిన బోర్డును చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. అద్దె చెల్లించడం లేదనే కారణంతోనే యజమానులే తాళాలు వేశారని తెలుసుకున్నారు. మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ బి.త్రివేణి ఈ విషయాన్ని కలెక్టర్ నారాయణరెడ్డికి ఫోన్ చేసి చెప్పారు. ఆయన ఆర్డీఓ అనంతరెడ్డిని కాలేజీకి పంపించారు. సమస్య పరిష్కారానికి అధికారులు హామీ ఇవ్వడంతో ఉదయం 11గంటలకు తాళాలు తెరుచుకున్నాయి. ఉదయం 9గంటలకే కళాశాలకు వచ్చిన విద్యార్థులు రెండు గంటల పాటు బయటే కూర్చున్నారు. ఇదిలా ఉండగా తమకు కేటాయించిన భవనాన్ని ఇవ్వలేదని ప్రిన్సిపాల్, అసలు అద్దె చెల్లించడం లేదని యజమానులు తెలిపారు.
సమచార లోపంతోనే..
శాఖల మధ్య నెలకొన్న సమాచార లోపం కారణంగానే సమస్య తలెత్తిందని స్టేట్ మెడికల్ ఎడ్యుకేషన్ ఉన్నతాధికారులు తెలిపారు. మంగళవారం అన్ని కాలేజీలు, హాస్టళ్లకు సంబంధించిన అద్దెలు చెల్లించామని పేర్కొన్నారు. కాలేజీలు యథావిధిగా కొనసాగుతాయని, విద్యార్థులు ఆందోళన చెందాల్సిన పనిలేదని స్పష్టంచేశారు.
ప్రభుత్వం అద్దె చెల్లించడం లేదని భవన యాజమాన్యం ఆగ్రహం
రెండు గంటల పాటు బయటే నిరీక్షించిన విద్యార్థులు, సిబ్బంది
కలెక్టర్, ఆర్డీఓ చొరవతో తెరుచుకున్న గదులు

మెడికల్ కాలేజీకి తాళం