
ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయొద్దు
● జిల్లా వైద్యాధికారి రజిత
సిరిసిల్ల: ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయొద్దని, ప్రభుత్వం నిర్వహించే ఉచిత వైద్యశిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వైద్యాధికారి రజిత కోరారు. జిల్లా కేంద్రంలోని బీవైనగర్లో శుక్రవారం నిర్వహించిన ఉచిత వైద్యశిబిరాన్ని సందర్శించి మాట్లాడారు. దీర్ఘకాలిక వ్యాధులు బీపీ, షుగర్, హెపటైటిస్ బీ, సీ వంటి వాటికి పరీక్షలు చేయించుకుని, నిర్ధారణ అయితే మందులు వాడాలన్నారు. సెప్టెంబరు వరకు ఉచిత వైద్యశిబిరాలు నిర్వహిస్తామని సుఖవ్యాధులు( హెచ్ఐవీ)లకు ఉచిత వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకొని, ప్రతి ఒక్కరూ ఆరోగ్య భద్రత కోసం జాగ్రత్త వహించాలన్నారు. ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ అనిత, టీబీ కో–ఆర్డినేటర్ బిగిందర్, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.