
ప్రజాసంక్షేమమే బీజేపీ లక్ష్యం
● పదకొండేళ్లలో అభివృద్ధిలో ముందంజ ● బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి
సిరిసిల్లటౌన్: ప్రజాసంక్షేమమే బీజేపీ ప్రభుత్వ లక్ష్యమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి పేర్కొన్నారు. పార్టీ జిల్లా ఆఫీస్లో గురువారం ‘పదకొండేళ్ల మోదీ ప్రభుత్వం – సంకల్పంతో సాకారం’పై సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథి అంజన్కుమార్ మొక్క నాటారు. వారు మాట్లాడుతూ జూన్ 6న అన్ని మండలాల్లో ఒకే స్థాయి కార్యశాలలు, జూన్ 9న జిల్లా స్థాయిలో ప్రెస్మీట్, జూన్ 10, 11 తేదీల్లో నియోజకవర్గాలలో ప్రెస్కాన్ఫరెన్స్, తర్వాత రోజుల్లో జిల్లా స్థాయిలో ప్రొఫెషనల్ మీట్స్, మేధావుల సదస్సులు నిర్వహిస్తామని వివరించారు. పార్టీ కార్యవర్గ సభ్యులు ఎర్ర మహేశ్, అల్లాడి రమేశ్, స్టేట్ కౌన్సిల్ మెంబర్ మ్యాన రాంప్రసాద్, ఓబీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి దేవేందర్యాదవ్, కార్యక్రమ కన్వీనర్ గరిపెల్లి ప్రభాకర్, కో–కన్వీనర్ నంద్యాడపు వెంకటేశ్ పాల్గొన్నారు.