
నీరుంటే నారు పోసుకోవచ్చు
● ఎప్పడూ ఒకే పంటలు వేయొద్దు ● ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి ● యూరియా, డీఏపీ వాడకం తగ్గించాలి ● లైసెన్స్ గల దుకాణాల్లో విత్తనాలు కొనాలి ● విత్తనాలు, ఎరువుల రశీదులు దాచుకోవాలి ● భూసార పరీక్షలు చేస్తాం ● ‘సాక్షి’ ఫోన్ఇన్లో జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్బేగం
సిరిసిల్ల: పది రోజుల ముందుగానే రుతుపవనాలు ప్రవేశించాయి. తొలకరి జల్లులు ముందే కురిశాయి. ఇప్పుడు మళ్లీ ఎండలు కొడుతున్నాయి. వర్షాలకు భూమి బాగా నానాలి.. భూమిలో వేడితగ్గాలి.. అప్పుడే ఏ విత్తనమైనా విత్తుకుంటే.. మొలకెత్తుతుంది. ఎప్పుడూ ఒకే పంటను వేయకుండా ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాని, పంట మార్పిడితో భూసారం పెరిగి ఎంతో ప్రయోజనం ఉంటుంది. నీరుంటే నారు పోసుకోవచ్చని రాజన్నసిరిసిల్ల జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్బేగం తెలిపారు. జిల్లా వ్యవసాయశాఖ ఆఫీస్లో బుధవారం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు ‘సాక్షి’ నిర్వహించిన ‘ఫోన్ఇన్’లో వ్యవసాయ అధికారులు మహేశ్వరీ, కృష్ణవేణిలతో కలిసి సమాధానాలు ఇచ్చారు. జిల్లాలోని నలుమూలల నుంచి అనేక మంది రైతులు ఫోన్ చేసి సాగులో సందేహాలకు సమాధానాలు పొందారు. ఆ విశేషాలు ఇవీ...

నీరుంటే నారు పోసుకోవచ్చు