
సన్నబియ్యం.. దేశానికే తలమానికం
● సిరిసిల్ల కాంగ్రెస్ ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డి
సిరిసిల్లటౌన్: సన్నబియ్యం పథకం దేశానికే తలమానికంగా నిలిచిందని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డి పేర్కొన్నారు. సిరిసిల్లలోని తన నివాసంలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. ప్రజాపాలన సాగిస్తున్న కాంగ్రెస్పై అక్కసుతో బీజేపీ, బీఆర్ఎస్లు దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు. పదేళ్లపాటు అవినీతికి అలవాటు పడిన బీఆర్ఎస్ నేతలు ప్రస్తుతం ఇందిరమ్మ ఇండ్ల పథకంలోనూ పేదల నుంచి డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కాళేశ్వరంలో అక్రమాల భయంతోనే కమీషన్ ముందుకు హాజరుకావడానికి జంకుతున్నారని ఎద్దేవా చేశారు. పది నెలల్లోనే రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు 58వేల ఉద్యోగాలు ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్, ఆడెపు చంద్రకళ, నాయకులు ఆకునూరి బాలరాజు, వైద్య శివప్రసాద్, గడ్డం నర్సయ్య, గోనె ఎల్లప్ప, యెల్లె లక్ష్మీనారాయణ, రాపెల్లి కళ్యాణ్ పాల్గొన్నారు.