
సర్కారు బడికి చేయూతనివ్వాలి
● మాజీ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
సిరిసిల్ల ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తూ ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తూ సర్కారు బడికి చేయూతనందించాలని మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ పౌరస్పందన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు అలుగుబెల్లి నర్సిరెడ్డి కోరారు. ‘ప్రభుత్వ బడులు నిలబడాలి–చదువుల్లో అంతరాలు పోవాలి’ అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ మంగళవారం సిరిసిల్ల చేరుకున్నారు. ప్రాథమిక పాఠశాలల్లో ప్రీప్రైమరీ తరగతులు ప్రారంభించాలని, తరగతి గదికి ఒక ఉపాధ్యాయుడిని నియమించాలని కోరారు. పౌరస్పందన వేదిక ఉపాధ్యక్షురాలు మంగ, కార్యవర్గ సభ్యులు నాగమణి, యూటీఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధర్మాన మూర్తి, రాష్ట్ర కార్యదర్శి గోల్కొండ శ్రీధర్, జిల్లా ప్రధాన కార్యదర్శి జంగిటి రాజు, జిల్లా ఉపాధ్యక్షుడు గుండమనేని మహేందర్రావు, కోశాధికారి అంబటి రమేశ్, కార్యదర్శులు పాముల స్వామి, కొత్వాల్ ప్రవీణ్, తిరుపతిజాదవ్, జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర బాధ్యులు సి.రామరాజు, జిల్లా అధ్యక్షుడు సిలువేరి సంపత్కుమార్ తదితరులు పాల్గొన్నారు.