
ఫిర్యాదులపై స్పందించాలి
● ఎస్పీ మహేశ్ బీ గీతే
ఎల్లారెడ్డిపేట/వీర్నపల్లి: పోలీస్స్టేషన్కు వచ్చే బాధితుల ఫిర్యాదులపై తక్షణం స్పందించాలని ఎస్పీ మహేశ్ బీ గీతే అన్నారు. మంగళవారం ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి పోలీస్స్టేషన్లను తనిఖీ చేశారు. ఠాణాలోని రికార్డులు, నమోదవుతున్న కేసులు, పెండింగ్ కేసుల వివరాలు తెలుసుకున్నారు. స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. అనంతరం సిబ్బందితో మాట్లాడుతూ, పెట్రోలింగ్ సమయంలో రౌడీషీటర్లు, హిస్టరీషీటర్ల కదలికలపై నిఘా పెట్టాలని, అనుమానితులు కనిపిస్తే వివరాలు సేకరించాలని సూచించారు. మత్తు పదార్థాల నివారణ, సైబర్నేరాలను అడ్డుకోవడంపై గ్రామాల్లోని యువతకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. గంజాయి రవాణా, సేవించడం, అసాంఘిక కార్యకలాపాలపై నిరంతంర నిఘా పెట్టి కట్టడి చేయాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ చంద్రశేఖర్రెడ్డి, సీఐ శ్రీనివాస్గౌడ్, ఎస్సై రమాకాంత్, ఎల్లాగౌడ్, సిబ్బంది ఉన్నారు.