కొనుగోలు కేంద్రాల్లో వసతులు కల్పిస్తాం | - | Sakshi
Sakshi News home page

కొనుగోలు కేంద్రాల్లో వసతులు కల్పిస్తాం

Apr 20 2025 1:49 AM | Updated on Apr 20 2025 1:49 AM

కొనుగ

కొనుగోలు కేంద్రాల్లో వసతులు కల్పిస్తాం

ముస్తాబాద్‌(సిరిసిల్ల): చేసిన ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో వసతులు కల్పిస్తామని డీఆర్‌డీవో శేషాద్రి శనివారం ప్రకటనలో తెలిపారు. ‘నిలువ నీడ లేదాయే’ శీర్షికన ‘సాక్షి’లో శనివారం ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. కేంద్రాల్లో చలువపందిళ్లు, తాగునీరు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను ఏర్పాటు చేయాలని నిర్వాహకులకు ఆదేశించినట్లు తెలిపారు. సెంటర్‌ నిర్వాహకులు నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొండాపూర్‌, ముస్తాబాద్‌ సీసీలు మాట్లాడుతూ కేంద్రాల్లో సకాలంలో ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నామని తెలిపారు. కొండాపూర్‌లో రైతుల కోసం షెడ్డు ఉందని, ముస్తాబాద్‌ సబ్‌సెంటర్‌లో తాత్కాలిక ఏర్పాట్లు చేస్తామని వారు వివరించారు.

ధాన్యం అన్‌లోడింగ్‌ పరిశీలన

ఇల్లంతకుంట(మానకొండూర్‌): ఇల్లంతకుంటలోని రహీంఖాన్‌పేటలో గల ధాన్యం గోదాంను శనివారం డీఆర్డీవో శేషాద్రి పరిశీలించారు. మండలంలోని 28 ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి లారీల్లో వస్తున్న ధాన్యాన్ని రహీంఖాన్‌పేట గోదాంలో నిల్వ చేస్తున్నారు. ఇన్‌చార్జి డీపీఎం శ్రీనివాస్‌, ఐకేపీ ఏపీఎం వాణిశ్రీ తదితరులు పాల్గొన్నారు.

బ్యాంకు డిపాజిట్లపై వడ్డీ పెంపు

సిరిసిల్లటౌన్‌: బ్యాంకులో నగదు డిపాజిటర్లకు రూ.50పైసలు అదనంగా వడ్డీ ఇస్తున్నామని సిరిసిల్ల సహకార అర్బన్‌బ్యాంకు చైర్మన్‌ రాపెల్లి లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. అంతర్జాతీయ సహకార సంవత్సర ఉత్సవాల్లో భాగంగా శనివారం నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. త్వరలోనే బ్యాంకులో డిజిటల్‌ లావాదేవీలు కస్టమర్లు నేరుగా చేసుకునేందుకు యూపీఐ, క్యూఆర్‌ కోడ్‌లను ప్రవేశపెడుతున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే రూ.104కోట్లు డిపాజిట్లు చేశామని.. ఈఏడాది మరో రూ.100కోట్లు డిపాజిట్లు సాధించేలా కృషి చేస్తామన్నారు. జిల్లా సహకారాధికారి రామకృష్ణ, బ్యాంకు సీఈవో పత్తిపాక శ్రీనివాస్‌, డైరెక్టర్లు గుడ్ల సత్యానందం, కోడం సంజీవ్‌, చొప్పదండి ప్రమోద్‌, వేములు సుక్కమ్మ, ఎనగందుల శంకర్‌, వలుస హరిణి పాల్గొన్నారు.

ప్రజావాణి రద్దు

సిరిసిల్ల: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించే ప్రజావాణిని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా శనివారం ప్రకటనలో తెలిపారు. హైకోర్టు కేసు విషయంలో వ్యక్తిగతంగా హాజరుకానుండడంతో అందుబాటులో ఉండడం లేదని స్పష్టం చేశారు. ప్రజలు ఎవరూ అర్జీలతో రావద్దని కోరారు.

బాధ్యతగా పనిచేయండి

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మరింత బాధ్యతగా పనచేయాలని... లేదంటే ఇతర ప్రాంతానికి ట్రాన్స్‌ఫర్‌ పెట్టుకోవాలని స్థానిక మహాత్మాజ్యోతిబాపూలే డిగ్రీ కాలేజీ అధ్యాపకులను గురుకులాల జాయింట్‌ సెక్రెటరీ శ్యాంప్రసాద్‌లాల్‌ హెచ్చరించారు. మండల కేంద్రంలోని మహా త్మాజ్యోతిబాపూలే డిగ్రీ కాలేజీని శనివారం తని ఖీ చేశారు. కళాశాలలోని అన్ని గ్రూపుల్లో కలిసి 32 మంది మాత్రమే చదువుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న విద్యాసంవత్సరంలో ఒక్కో అధ్యాపకుడు 10 మంది చొప్పున విద్యార్థులు అడ్మిషన్‌ పొందేలా చూడాలన్నారు.

జేఈఈ మెయిన్స్‌లో ప్రతిభ

ఇల్లంతకుంట(మానకొండూర్‌): రేపాకకు చెందిన రోండ్ల దత్తాశ్రీరెడ్డి జేఈఈ మెయి న్స్‌లో జాతీయస్థాయిలో 6,581 ర్యాంక్‌ సాధించాడు. తండ్రి జగన్‌మోహన్‌రెడ్డి టీచర్‌, తల్లి గృహిణి.

కొనుగోలు కేంద్రాల్లో వసతులు కల్పిస్తాం
1
1/3

కొనుగోలు కేంద్రాల్లో వసతులు కల్పిస్తాం

కొనుగోలు కేంద్రాల్లో వసతులు కల్పిస్తాం
2
2/3

కొనుగోలు కేంద్రాల్లో వసతులు కల్పిస్తాం

కొనుగోలు కేంద్రాల్లో వసతులు కల్పిస్తాం
3
3/3

కొనుగోలు కేంద్రాల్లో వసతులు కల్పిస్తాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement