
లక్ష్మీనరసింహుని బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
సింగరాయకొండ: ప్రసిద్ది చెందిన పాతసింగరాయకొండలోని శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో స్వామివారి బ్రహ్మోత్సవాలకు శుక్రవారం శాస్త్రోక్తంగా అంకురార్పణ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఉదయగిరి వెంకట లక్ష్మీనరసింహాచార్యులు ఆధ్వర్యంలో వేద పండితులు ఊరేగింపుగా వచ్చి పుట్టమట్టి సేకరించి పూజలు చేశారు. ఆ మట్టిలో నవధాన్యాలు మొలకెత్తే విధంగా చేసి ఆలయ నలుమూల ఏర్పాటు చేయడంతో బ్రహ్మోత్సవాలలో తొలి ప్రధాన ఘట్టం పూర్తయింది. శనివారం మధ్యాహ్నం ధ్వజారోహణ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలలో ముఖ్య ఘట్టం పూర్తవుతుందని, స్వామివారి గరుడప్రసాదం భక్తులకు పంచిపెడతామని, దీని కోసం రాష్ట్రంలోని నలుమూలల నుంచి భక్తులు వస్తారని ఆలయ కార్యనిర్వహణాధికారి పి.కృష్ణవేణి వివరించారు.