
విజయవాడకు తరలి వెళ్లిన ఉద్యోగులు
ఒంగోలు సిటీ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన చలో విజయవాడ కార్యక్రమానికి జిల్లా నుంచి వందలాది మంది ఉద్యోగులు తరలి వెళ్లారు. గురువారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం విజయవాడలోని ఎస్ఎస్ కన్వన్షన్ హాల్ బందర్ రోడ్డులో జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రకాశం జిల్లా అధ్యక్షుడు చిన్నపరెడ్డి కిరణ్కుమార్రెడ్డి ఆధ్వర్యంలో వందల సంఖ్యలో ఉద్యోగులు వివిధ తాలూకాల నుంచి హాజరై సభను జయప్రదం చేశారు. సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ మాట్లాడుతూ ప్రస్తుతం ఉద్యోగులు ఎదుర్కొంటున్న 14 ప్రధాన డిమాండ్లను నెరవేరే దానికి ప్రభుత్వానికి కొంత గడువు ఇస్తున్నామని, తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని ప్రకటించారు. జిల్లా కార్యదర్శి వరకుమార్, ట్రేడర్ రంగారెడ్డి, సహాధ్యక్షుడు మసూద్, ఒంగోలు పట్టణ అధ్యక్షుడు మోటా శ్రీనివాసరావు, కార్యదర్శి శ్రీకాంత్రెడ్డి, ఒంగోలు తాలూకా అధ్యక్షుడు సురేష్, కార్యదర్శి శ్రీదేవి, మార్కాపురం పట్టణ అధ్యక్షుడు చెంచిరెడ్డి, దర్శి తాలూకా అధ్యక్షుడు ఎన్వీ సుబ్బారెడ్డి, గిద్దలూరు తాలూకా అధ్యక్షుడు ఎస్వీ రంగయ్య, కంభం తాలూకా అధ్యక్షుడు ప్రసాద్రెడ్డి, ఎర్రగొండపాలెం తాలూకా అధ్యక్షుడు జానీబాషా పాల్గొన్నారు.