
కారు ఢీకొని వృద్ధుడు మృతి
చీమకుర్తి రూరల్:
రోడ్డు పక్కన నిల్చున్న వృద్ధుడిని వేగంగా వెళ్తున్న కారు ఢీకొనడంతో తీవ్రగాయాలతో మృత్యువాతపడ్డాడు. ఈ సంఘటన చీమకుర్తి మండలంలోని రెడ్డినగర్ వద్ద సోమవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. రెడ్డి నగర్కు చెందిన గుణపాటి తిరుపతిరెడ్డి(60) సోమవారం రాత్రి 10 గంటల సమయంలో రోడ్డు పక్కన నిల్చుని ఉన్నాడు. అదే సమయంలో ఒంగోలు నుంచి చీమకుర్తి వైపు వేగంగా వెళ్తున్న కారు ఢీకొట్టడంతో తిరుపతిరెడ్డికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని స్థానికులు హుటాహుటిన ఒంగోలు జీజీహెచ్కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మంగళవారం జీజీహెచ్లో పోస్ట్మార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. కారుతోపాటు ఓనర్ను అదుపులోకి తీసుకున్నామని, కేసు దర్యాప్తు చేస్తున్నామని చీమకుర్తి సీఐ సుబ్బారావు తెలిపారు.