
సత్తాచాటిన నంద్యాల జిల్లా ఎడ్లు
బేస్తవారిపేట: మండలంలోని జేసీ అగ్రహారంలో పట్టాభిరామస్వామి ఆలయ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం నిర్వహించిన బండలాగుడు పోటీలు హోరా హోరీగా సాగాయి. ఈ పోటీలను వైఎస్సార్ సీపీ గిద్దలూరు నియోజకవర్గ ఇన్చార్జ్ కేపీ నాగార్జునరెడ్డి ప్రారంభించారు. ఆలయ కమిటీ సభ్యులు, గ్రామపెద్దలు మేళతాళాలతో, శాలువ, పూలమాలలు వేసి ఘనస్వాగతం పలికారు. నంద్యాల జిల్లా సంజమాల మండలం ఆకుమళ్లకు చెందిన కాకర్ల నాగజ్యోతి ఎడ్లు 4444 అడుగుల దూరం మొదటి స్థానంలో నిలిచాయి. పల్నాడు జిల్లా కోసూరు మండలం బయ్యవరానికి చెందిన కడియం మణికంఠ ఎడ్లు 3918 అడుగులు, నంద్యాల జిల్లా రోళ్లపాడుకు చెందిన డాక్టర్ పేరెడ్డి ప్రభాకర్రెడ్డి ఎడ్లు 3750 అడుగులు, గిద్దలూరు మండలం ముళ్లపాడుకు చెందిన కంచర్ల తనీస్ ఎడ్లు 3750 అడుగులు, కంభం మండలం ఎర్రబాలేనికి చెందిన వెంకటగిరి హేమలతానాయుడు ఎడ్లు 3328 అడుగులు దూరంలాగి రెండోవ, మూడోవ, నాల్గోవ స్థానంలో నిలిచాయి. పోటీల్లో గెలుపొందిన ఎడ్ల యజమానులకు వరుసగా రూ.25 వేలు, రూ.20 వేలు, రూ.12,500, రూ.12,500, రూ.5 వేల నగదు బహుమతులను దప్పిలి బ్రదర్స్ అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ వేగినాటి ఓసూరారెడ్డి, జెడ్పీటీసీ బీవీ రాజయ్య, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ ఆవుల శ్రీధర్రెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు వెన్నా భాస్కర్రెడ్డి, పంచాయతీరాజ్ వింగ్ కన్వీనర్ మల్లెల శేఖర్రెడ్డి, మాజీ ఎంపీటీసీ దప్పిలి రామచంద్రారెడ్డి, మాజీ సర్పంచ్ బుగ్గారెడ్డి, నాయకులు రామిరెడ్డి, సిద్దారెడ్డి, కాశిరెడ్డి, భూపాల్రెడ్డి పాల్గొన్నారు.
నేడు సీనియర్ ఎడ్ల
బండలాగుడు పోటీలు
బేస్తవారిపేట: మండలంలోని జేసీ అగ్రహారంలో పట్టాభిరామస్వామి ఆలయం వార్షికోత్సవం సందర్భంగా సోమవారం సీనియర్ ఎడ్ల బండలాగుడు పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. పోటీల్లో గెలుపొందిన ఎడ్ల యజమానులకు 1 నుంచి 8వ బహుమతులు వరుసగా రూ.50 వేలు, రూ.40 వేలు, రూ.30 వేలు, రూ.20 వేలు,రూ. 15 వేలు, రూ.12 వేలు, రూ.10 వేలు, రూ.6 వేలను అందజేస్తారన్నారు. పూర్తి వివరాలకు 77022 92595, 97058 94632, 91777 09989 నంబర్లను సంప్రదించాలని కోరారు.