ఆవు పాల ధర పెంచాలి | - | Sakshi
Sakshi News home page

ఆవు పాల ధర పెంచాలి

May 1 2025 1:09 AM | Updated on May 1 2025 1:09 AM

ఆవు ప

ఆవు పాల ధర పెంచాలి

కొత్తపట్నం: పాల ధరలు పడిపోవడంతో డెయిరీ నిర్వహణ భారంగా మారిందని వాటి యజమానులు కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తపట్నం మండలం రంగాయపాలెంలో కృష్ణం వెంకట్రావు 32 ఆవులతో నడుపుతున్న డెయిరీ ఫామ్‌ను కలెక్టర్‌ బుధవారం సందర్శించారు. పెట్టుబడి, మిగులు ఆదాయం, కష్టనష్టాలు తెలుసుకున్నారు. డెయిరీ యమాజని కృష్ణం వెంకట్రావు మాట్లాడుతూ.. రూ.25 లక్షల పెట్టుబడి పెట్టానని, పాలపై వస్తున్న ఆదాయం ఈఎంఐలు, కూలి, దాణా ఖర్చులకు సరిపోవడం లేదని కలెక్టర్‌కు వివరించారు. గత ఏడాది లీటర్‌ ఆవు పాలు రూ.40 కాగా ఈ ఏడాది రూ.35కు పడిపోయిందని తెలిపారు. లీటరు పాలపై రూ.6 వరకు ధర పడిపోవడంతో డెయిరీ మూత వేసే యోచనలో ఉన్నట్లు మరో నిర్వాహకుడు షేక్‌ సిరాజ్‌ కలెక్టర్‌ ఎదుట ఆవేదన వెలిబుచ్చారు. లీటరు పాలకు రూ.40 దక్కేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

పెట్రోల్‌ బంక్‌ బాయ్‌పై

గంజాయి మత్తులో దాడి

టంగుటూరు: గంజాయి మత్తులో ఉన్న వ్యక్తులు పెట్రోల్‌ బంక్‌లో పనిచేసే యువకుడిపై దాడికి తెగబడ్డారు. బుధవారం రాత్రి టంగుటూరులో చోటుచేసుకున్న ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన యువకుడు సుధాకర్‌ ఒంగోలు జీజీహెచ్‌లో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. అందిన సమాచారం మేరకు వివరాలు.. టంగుటూరులోని నయారా పెట్రోల్‌ బంకుకు గంజాయి మత్తులో ముగ్గురు వ్యక్తులు వచ్చారు. పెట్రోల్‌ తాలూకు నగదు విషయంలో బంక్‌ పంప్‌ బాయ్‌ సుధాకర్‌తో గొడవకు దిగారు. బంక్‌లో ఉన్న పరికరాలతో మోదడంతో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. అతని పరిస్థితి విషమంగా ఉందని, రిమ్స్‌ అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నాడని బంక్‌ సిబ్బంది తెలిపారు. సీసీ ఫుటేజీలో రికార్డు అయిన దృశ్యాల ఆధారంగా, బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

గత ఏడాది లీటరు రూ.40.. ఇప్పుడేమే రూ.34

ఇలాగైతే డెయిరీ ఫామ్‌లు మానుకుంటాం

కలెక్టర్‌ ఎదుట డెయిరీ ఫామ్‌ యజమానుల ఆవేదన

ఆవు పాల ధర పెంచాలి1
1/1

ఆవు పాల ధర పెంచాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement