
ఉదయ్కృష్ణారెడ్డికి సీఎం ప్రశంసలు
సింగరాయకొండ: సివిల్ ఫలితాల్లో జాతీయస్థాయిలో 350వ ర్యాంకు సాధించిన మండలంలోని ఊళ్లపాలెం గ్రామానికి చెందిన ఎం ఉదయ్కృష్ణారెడ్డిని మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారాలోకేష్ ఎక్స్ వేదికగా ప్రశంసించారు. ఒక ప్రభుత్వ పాఠశాల విద్యార్థి పోలీస్ కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ అధికారి వరకు అతని ప్రయాణం ధైర్యసాహసాలు, త్యాగం, అవిశ్రాంత సంకల్పం స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు.
వెలిగొండ నిర్వాసితులకు న్యాయం చేయండి
● సబ్ కలెక్టర్ త్రివినాగ్కు వినతి
మార్కాపురం: పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ముంపునకు గురవుతున్న గొట్టిపడియ, అక్కచెరువు, సుంకేశుల, కలనూతల, గుండంచర్ల, లక్ష్మీపురం, కృష్ణానగర్, సాయిరామ్నగర్, లింగాపురం, సాయినగర్, చింతలముడిపి గ్రామాల్లోని నిర్వాసితులకు ఆర్ఆర్ ప్యాకేజీ అమలు చేయాలని నిర్వాసితుల సంఘ కార్యదర్శి గాలి వెంకటరామిరెడ్డి, ఒంటెద్దు చిన్న రంగారెడ్డి తదితరులు మంగళవారం సబ్కలెక్టర్ త్రివినాగ్కు వినతిపత్రం అందించారు. మళ్లీ ఆర్థిక సర్వే నిర్వహించి, అర్హులైన వారిని ఆర్ఆర్ ప్యాకేజీ జాబితాలో చేర్చాలని విన్నవించారు. ప్రాజెక్టు మిగులు పనులను త్వరగా పూర్తిచేసి కృష్ణా నీటిని విడుదల చేయాలని కోరారు. వీరి వెంట పలువురు నిర్వాసితులు ఉన్నారు.
రోడ్డు ప్రమాదంలో
ఆటో డ్రైవర్ మృతి
పెద్దారవీడు: ఎదురురెదురుగా వస్తున్న లారీ, ట్రాలీ ఆటో ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందారు. ఈ సంఘటన మండలంలోని సానికవరం– మద్దలకట్ట గ్రామాల మధ్య రామకృష్ణ ధాన్య మందిరం దగ్గర మంగళవారం జరిగింది. స్థానికులు తెలిపి న వివరాలు కర్నాటక రాష్ట్రం నుంచి ట్రాలీ ఆటో లోడుతో గుంటూరుకు వెళ్తుంది. గుంటూరు నుంచి లారీ లోడుతో కర్నూల్కు వెళ్తుంది. రామకృష్ణ ధ్యాన మందిరం దగ్గరకు రాగానే రెండు వాహనా లు ఢీకొట్టుకోవడంతో ట్రాలీ ఆటో డ్రైవర్ కిరణ్ (32) అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడు కిరణ్ కర్నాటక రాష్ట్రం హుబ్లి దగ్గర లక్కహుండి గ్రామ వాసిగా గుర్తించారు. లారీ డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. గాయాలైన డ్రైవర్ను స్థానికులు 108 అంబులెన్స్లో మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కిరణ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఉదయ్కృష్ణారెడ్డికి సీఎం ప్రశంసలు

ఉదయ్కృష్ణారెడ్డికి సీఎం ప్రశంసలు