
ముగిసిన యూటీఎఫ్ జిల్లా స్థాయి శిక్షణ తరగతులు
ఒంగోలు సిటీ: యూటీఎఫ్ రాష్ట్ర సంఘ పిలుపు మేరకు జిల్లా శాఖ రెండు రోజుల శిక్షణ తరగతులు శని, ఆదివారాల్లో పేస్ ఇంజినీరింగ్ కాలేజీ లో నిర్వహించామని జిల్లా ప్రధాన కార్యదర్శి డీ వీరాంజనేయులు తెలిపారు. శిక్షణ తరగతులను రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కె శ్రీనివాసరావు ప్రారంభించారు. యూటీఎఫ్ భావజాలాన్ని సహాధ్యక్షుడు కే సురేష్ కుమార్ వివరించారు. విద్యారంగ పరిణామాలను ఎన్ నవకోటేశ్వరరావు, సంస్థ నిర్మాణాలను కర్తవ్యాలను కే శ్రీనివాసరావు, ఆడిట్ రికార్డు నిర్వహణపై ఎన్ చిన్నస్వామి, ఎం రాము అవగాహన కల్పించారు. ఆదివారం పెన్షన్ రూల్స్ను జే కేశవరాజు, లీవ్ రూల్స్ను రాష్ట్ర నాయకులు టీఎస్ఎల్ఎన్ మల్లేశ్వరరావు, బదిలీల చట్టం నిబంధనను ఎస్ రవి, సీపీఎస్ పెన్షన్, జెడ్పీ పీఎఫ్ లోన్స్, మెడికల్ బిల్స్పై ఎస్కే అబ్దుల్ హై, వర్తమాన రాజకీయాలను డీ వీరాంజనేయులు, మహిళా ఉద్యమం గురించి జీ ఉమామహేశ్వరి వివరించారు. మే 2వ తేదీ డీ రామిరెడ్డి తొమ్మిదో వర్ధంతి సభ, స్మారక ఉపన్యాసం దర్శిలో జరుగుతుందని, జయప్రదం చేయాలని కోరారు.
ఒంగోలు రైల్వేస్టేషన్లో తనిఖీలు
ఒంగోలు టౌన్: పహల్గామ్లో ఉగ్రదాడుల నేపథ్యంలో ఒంగోలులోని రైల్వేస్టేషన్లో జీఆర్పీ పోలీసులు ఆదివారం ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జీఆర్పీ సీఐ షేక్ మౌలా షరీఫ్, ఎస్ఐ కె.మధుసూదనరావు పాల్గొని మొబైల్ సెక్యూరిటీ చెక్ డివైస్ (ఎంఎస్డీసీ) ద్వారా తనిఖీలు చేసి పలువురు అనుమానితులను గుర్తించారు. ఎటువంటి నేరాలకు పాల్పడకుండా వారిని ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. ఆర్పీఎఫ్ సిబ్బందితో కలిసి రైల్వే ప్లాట్ఫాం, పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. రైల్వే స్టేషన్ పరిధిలోని ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు.