హామీలు నెరవేర్చలేనన్న ఏకై క సీఎం చంద్రబాబు | - | Sakshi
Sakshi News home page

హామీలు నెరవేర్చలేనన్న ఏకై క సీఎం చంద్రబాబు

Apr 22 2025 1:57 AM | Updated on Apr 22 2025 2:35 AM

హామీల

హామీలు నెరవేర్చలేనన్న ఏకై క సీఎం చంద్రబాబు

యర్రగొండపాలెం: ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు అనేక హామీలు ఇచ్చాడని, అధికారంలోకి వచ్చాక ఈ సూపర్‌ సిక్స్‌ నేను చేయలేను, నాకు చేతకాదని చెప్పిన ఒకే ఒక ముఖ్యమంత్రి చంద్రబాబేనని దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి విమర్శించారు. త్రిపురాంతకం ఎంపీపీగా ఆళ్ల సుబ్బమ్మ ఆంజనేయరెడ్డి ప్రమాణ స్వీకార మహోత్సవంలో సోమవారం ఆయన మాట్లాడారు. శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ.. మన నాయకుడు వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఎన్ని కష్టాలు వచ్చినా ఇచ్చిన హామీలను నెరవేర్చిన ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారని అన్నారు. మనందరి లక్ష్యం ఒక్కటేనని, 2029లో జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవటం, ఎమ్మెల్యే తాటిపర్తిని మళ్లీ 30 వేల మెజార్టీతో గెలిపించడమేనని, మేము ఎప్పుడూ కార్యకర్తలకు అండగా ఉంటామని అన్నారు.

సభకు అధ్యక్షత వహించిన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌ మాట్లాడుతూ మండలంలో టీడీపీకి ఏ మాత్రం అభిమానం లేకపోయినా అధికారం ఉందన్న అహంకారంతో ఎంపీపీ పీఠాన్ని అధిష్టించాలనుకొని చతికిల పడ్డారని అన్నారు. ఒక ఎంపీటీసీ ఆళ్ల ఆంజనేయరెడ్డిని జైల్లో పెట్టించి, ఇంకొక ఎంపీటీసీ కృష్ణను ఇంట్లో అరెస్ట్‌ చేసి, మరొక ఎంపీటీసీ సృజనను తీసుకొనివెళ్లి వాళ్ల ఇంట్లోనే పెట్టుకొని ఎన్నో కుయుక్తులు పన్నారని అన్నారు. మండల పరిషత్‌లో సాధించిన విజయాన్ని ప్రతి ఒక్కరూ గర్వంగా చెప్పుకోవాలని, వైఎస్సార్‌ సీపీ జెండా మనకు అండగా ఉందని గ్రామాల్లో తెలపాలన్నారు. విశాఖలో అత్యంత ఖరీదైన భూమి మాత్రం ఎకరా 99 పైసలు, క్వార్టర్‌ మద్యం బాటిల్‌ మాత్రం రూ.99 అని.. ఇది చేతకాని దద్దమ్మ ప్రభుత్వం చేసే పని అన్నారు. ఇక్కడ గెలిచిన ఎంపీపీలకు, ఎంపీటీసీలకు, సర్పంచ్‌లకు సంబంధం లేకుండా, తీర్మానాలు లేకుండా పనులు చేసుకుంటూ పోతూ ఉంటే తాము ఊరుకునే ప్రసక్తేలేదని, దెబ్బకు దెబ్బ తీస్తామన్నారు. జెడ్పీ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ కార్యకర్తలతోనే పార్టీ నడుస్తుందని, అటువంటి కార్యకర్తలకు జగన్‌మోహన్‌రెడ్డి పెద్దపీట వేస్తున్నారని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో పేదలకు ఏ ఒక్క పథకం అందడంలేదని, రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదని విమర్శించారు. కార్యక్రమంలో నూతనంగా ఎంపికై న ఎంపీపీ ఆళ్ల సుబ్బమ్మ ఆంజనేయరెడ్డి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఒంగోలు మూర్తిరెడ్డి, కార్యదర్శి కె.ఓబులరెడ్డి, వైపాలెం ఎంపీపీ దొంతా కిరణ్‌గౌడ్‌, జెడ్పీటీసీలు యేర్వ చలమారెడ్డి, వాగ్యా నాయక్‌, పార్టీ మండల కన్వీనర్లు ఏకుల ముసలారెడ్డి, పి.కృష్ణారెడ్డి, జి.వెంకట రమణారెడ్డి, ఎస్టీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు రాములు నాయక్‌, బూత్‌ కన్వీనర్ల నియోజకవర్గ అధ్యక్షుడు ఒంగోలు సుబ్బారెడ్డి పాల్గొన్నారు.

ఎంపీపీ ఆళ్ల సుబ్బమ్మను అభినందించిన కారుమూరి, చెవిరెడ్డి

త్రిపురాంతకం ఎంపీపీగా పదవీ స్వీకారం చేస్తున్న ఆళ్ల సుబ్బమ్మ ఆంజనేయరెడ్డిని సోమవారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రీజినల్‌ కో ఆర్డినేటర్‌, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఒంగోలు పార్లమెంట్‌ నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అభినందించారు. వారితోపాటు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌, దర్శి ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మలు సుబ్బమ్మతోపాటు ఎన్నికల సమయంలో కీలకంగా వ్యవహరించిన ఎంపీటీసీ సభ్యులు సృజన, కృష్ణలను వారు అభినందించారు. ముందుగా బస్టాండ్‌ సెంటర్‌లో ఉన్న వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. తనను అభినందించటానికి తమ ఇంటి వద్దకు వచ్చిన వారికి సుబ్బమ్మ శాలువకప్పి ఘనంగా సన్మానించారు.

దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి

హామీలు నెరవేర్చలేనన్న ఏకై క సీఎం చంద్రబాబు1
1/2

హామీలు నెరవేర్చలేనన్న ఏకై క సీఎం చంద్రబాబు

హామీలు నెరవేర్చలేనన్న ఏకై క సీఎం చంద్రబాబు2
2/2

హామీలు నెరవేర్చలేనన్న ఏకై క సీఎం చంద్రబాబు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement