
కాంట్రాక్ట్ కార్మికులకు హక్కులు కల్పించాలి
గోదావరిఖని: సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు చట్టబద్ధ మైన హక్కులు కల్పించి, కోలిండియా వేతనాలు అమలు చేయాలని కోరుతూ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ క మిటీ(జేఏసీ) ఆధ్వర్యంలో మంగళవారం ఆర్జీ–1 జీఎం కా ర్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా నాయకులు మాట్లాడుతూ, సింగరేణిలోని వివిధ విభాగాల్లో సుమారు 35వేల మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నా రన్నారు. వారందరికీ చట్టబద్ధమైన వేతనాలు చెల్లించకపోవడంతో ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాలను పోషించుకోలేక పోతున్నారని అన్నారు. జేబీసీసీఐ నిర్ణయించిన హైపవర్ క మిటీ వేతనాలను 2013 నుంచి అమలు చేయాల్సి ఉండగా సింగరేణి ఇప్పటి వరకు అమలు చేయడం లేదని ఆరోపించా రు. కోలిండియా పరిధిలోని కొన్ని సంస్థలు హైపవర్ కమిటీ వేతనాలను అమలు చేస్తున్నా.. లాభాల్లో నడుస్తున్న సింగరే ణి కుంటిసాకులు చూపి అమలు చేయకపోవడం అన్యాయ మన్నారు. జేఏసీ నాయకులు రియాజ్ అహ్మద్, ఐ.కృష్ణ, కోటగిరి పాపయ్య, సుద్దాల కుమారస్వామి, ఇ.నరేశ్, కొండ్ర మొగిలి, సంగం రాజు, చిటికెల రాయలింగు, గోనె సంతోష్, దబ్బెట సతీశ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆర్జీ–1 ఎస్వోటూ జీఎంకు వినతిపత్రం అందజేశారు.