
ఆ పాఠశాలకు అనుమతిలేదు
గోదావరిఖనిటౌన్: నగరంలోని మార్కండేయకాలనీలో గల బ్రిలియంట్ గ్రామర్ హైస్కూల్కు ప్రభుత్వ అనుమతి లేకపోవడంతో మూసివేస్తున్నట్లు మండల విద్యాధికారి చంద్రయ్య శనివారం తెలిపారు. తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన కోరారు. అందులో ప్రవేశాల కోసం ప్రోత్సహించినా, ప్రచారం చేసినా చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. పాఠశాల, కళాశాలలో పిల్లలను చేర్పించే ముందు ప్రభుత్వ అనుమతి ఉందా, లేదా? అని తల్లిదండ్రులు తెలుసుకోవాలని ఆయన కోరారు.
గాలికుంటు నివారణ టీకా తప్పనిసరి
జ్యోతినగర్(రామగుండం): పశువులకు తప్పనిసరిగా గాలికుంటు నివారణ టీకాలు వేయించాలని జిల్లా పశువైద్యాధికారి శంకర్ సూచించారు. బల్దియా మూడో డివిజన్ మేడిపల్లిలో శనివారం ఏర్పాటు చేసిన వైద్యశిబిరంలో ఆయన మాట్లాడారు. పాడి రైతులు తమ గేదెలు, ఆవులు, ఎద్దులకు గాలికుంటు నివారణ టీకాలు వేయించాలని అన్నారు. ప్రభుత్వం టీకాలు ఉచితంగా అందిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో చంద్రశేఖర్, రాంకిరణ్తోపాటు రైతులు పాల్గొన్నారు.
లైవ్ సర్టిఫికెట్ ఇవ్వండి
గోదావరిఖని: సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులు పింఛన్ పొడిగింపు కోసం డిజిటల్ లైవ్ సర్టిఫికెట్ సమర్పించాలని గోదావరిఖనిలోని సీఎంపీఎఫ్ రీజినల్ కమిషనర్ హరి పచౌరీ కోరా రు. శనివారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. తమ పరిధిలో సుమారు 65 వేల మంది బొగ్గుగని కార్మికులు పింఛన్ పొందుతున్నారని, వీరిలో 60శాతం మంది డిజిటల్ లైవ్ సర్టిఫి కెట్ ఇచ్చారని పేర్కొన్నారు. మిగతా వారు అప్లోడ్ చేయాల్సి ఉందన్నారు. వాస్తవానికి ఏటా నవంబర్ ఆఖరు వరకు ఈప్రక్రియ ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉందన్నారు.
నేడు యువ ఉద్యోగుల సదస్సు
గోదావరిఖని: సింగరేణి సంస్థలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై ఆదివారం గౌతమినగర్ శ్రీమయి ఫంక్షన్హాల్లో యువ ఉద్యోగుల సదస్సు నిర్వహిస్తామని ఏఐటీయూసీ నాయకులు స్వామి, మడ్డి ఎల్లాగౌడ్ తెలిపారు. తొలుత ఫైవింక్లయిన్చౌరస్తా నుంచి మెయిన్ చౌరస్తా, మార్కండేయకాలనీ, గౌతమినగర్ నుంచి శ్రీమయి ఫంక్షన్హాల్ వరకు ర్యాలీ నిర్వహిస్తామని పేర్కొన్నారు. యువ ఉద్యోగులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు.
24న జాబ్మేళా
పెద్దపల్లిరూరల్: జిల్లాలోని నిరుద్యోగ యువతకు శ్రీరామ లైఫ్ ఇన్సూరెన్సు కార్పొరేట్ లిమిటెడ్లో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ఈనెల 24న జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి తిరుపతిరావు తెలిపారు. పెద్దపల్లిలో పనిచేసేందుకు 12 మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. డిగ్రీ, ఎంబీఏ ఉత్తీర్ణులైనవారు అర్హులన్నారు. నెలకు రూ.18,500 వేతనం చెల్లి స్తారని పేర్కొన్నారు. ఈనెల 24న ఉదయం 11 గంటలకు కలెక్టరేట్లోని తమ కార్యాలయంలో హాజరుకావాలని కోరారు. వివరాల కు 96529 53759, 89853 36947 సెల్ నంబర్లలో సంప్రదించాలని ఆయన సూచించారు.
కలెక్టరేట్ ఎదుట వీహెచ్పీ నేతల నిరసన
పెద్దపల్లిరూరల్: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా శనివారం కలెక్టరేట్ ఎదుట విశ్వహిందూపరిషత్ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. హిందువులపై దాడులకు తెగబడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వీహెచ్పీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ స్వరూప్కిరణ్గౌడ్ డిమాండ్ చేశారు. పశ్చిమబెంగాల్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాగులమల్యాల సత్యం, బత్తుల విజయ్, తారాబాయి, దిలీప్, రమేశ్, మహేందర్, కవిత, శ్రీవాణి, మణిదీప్, చందు, అజయ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

ఆ పాఠశాలకు అనుమతిలేదు