
విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు
సాలూరు: వైఎస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఈనెల 4న నిర్వహించిన వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని విజయవంతం చేసిన సాలూరు నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో చేపట్టిన నిరసన ర్యాలీని ఊహకందని రీతిలో ప్రజలు విజయవంతం చేశార న్నారు. భవిష్యత్లో ప్రజావ్యతిరేక విధానాలపై చేపట్టనున్న పోరాటానికి ఇదే తరహాలో ప్రజలు సహకరించాలని రాజన్నదొర విజ్ఞప్తి చేశారు.