
ఈదురు గాలులకు నేలకొరిగిన చెట్లు
వేపాడ: మండలంలోని పలు గ్రామాల్లో గురువారం మధ్యాహ్నం కురిసిన ఈదురగాలులతో కూడిన వర్షానికి చెట్లు, విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి. చామలాపల్లి–దబ్బిరాజుపేట రోడ్డులో చామలాపల్లి పసలమ్మ అమ్మవారి ఆలయ సమీపంలో భారీ చెట్టు విరిగి రోడ్డుపై పడడంతో రాకపోకలకు కాసేపు అంతరాయం కలిగింది. ఈదురగాలులకు మామిడి పంటకు నష్టం వాటిల్లింది. చామలాపల్లిలో విద్యుత్ స్తంభం విరిగిపోయింది. దబ్బిరాజపేట, చామలాపల్లి, కరకవలస, పోతుబందిపాలెం, వెంకయ్యపాలెం గ్రామాల్లో భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.