శుక్రవారం శ్రీ 6 శ్రీ జూన్‌ శ్రీ 2025 | - | Sakshi
Sakshi News home page

శుక్రవారం శ్రీ 6 శ్రీ జూన్‌ శ్రీ 2025

Jun 6 2025 1:13 AM | Updated on Jun 6 2025 1:13 AM

శుక్ర

శుక్రవారం శ్రీ 6 శ్రీ జూన్‌ శ్రీ 2025

రూ.లక్షల్లో ముట్టజెప్పాల్సిందే..

● మామ్మూళ్ల మత్తులో మున్సిపల్‌ అధికారులు

ఏకరవు పెట్టిన బాధితులు

పార్వతీపురం మున్సిపల్‌ కమిషనర్‌పై

విచారణ

కమిషనర్‌ తీరుపై

ఆరోపణల వెల్లువ

మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటేశ్వర్లు తీరు ఆది నుంచి వివాదాస్పదంగానే ఉంది. కూటమి ఎమ్మెల్యే విజయచంద్రకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని.. తమ పట్ల వివక్ష చూపుతున్నారని వైఎస్సార్‌సీపీ కౌన్సిల్‌ సభ్యులు పలుమార్లు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ మొదలు మున్సిపల్‌ సమావేశాలు నిర్వహించలేదని ఇటీవల ఆర్డీ దృష్టికి వారు తీసుకెళ్లారు. పట్టణంలో అక్రమ వసూళ్లపై ఆయనతో పాటు.. సిబ్బంది మీద అనేక ఆరోపణలు వచ్చాయి. వరహాల గెడ్డ వద్ద అక్రమంగా ఇళ్లు నిర్మించుకున్నారని.. ఖాళీ చేయకుంటే కూల్చివేస్తామని 24 మందికి నోటీసులిచ్చి, అనంతరం ఒక్కొక్కరి వద్ద రూ.2 లక్షలు చొప్పున వసూలు చేసినట్లు తెలిసింది. పట్టణ ప్రణాళిక విభాగం ద్వారా పలు నిర్మాణాలకు నోటీసులిచ్చి, అక్రమమని బెదిరించి.. ఆ తర్వాత వారిపై ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. పెద్ద ఎత్తున నగదు చేతులు మారాయని ఆరోపణలు వచ్చాయి.

సాక్షి, పార్వతీపురం మన్యం:

‘మున్సిపల్‌ కార్యాలయంలో లంచం ఇవ్వనిదే ఏ పనీ జరగదు.. అన్నీ చట్టబద్ధంగా ఉన్నా సరే.. ముడుపులు ముట్టనిదే ఫైల్‌ ముందుకు కదలదు. అలా అని ఏ ఒక్కరికో చెల్లిస్తామంటే కుదరదు.. ఒక దస్త్రం ఎన్ని విభాగాల వద్దకు వెళ్తే.. అన్ని చోట్లా చేయి తడపాల్సిందే. పనిని బట్టి రూ.వేల నుంచి రూ.లక్షల వరకు ఖర్చు అవుతుంది.’ ఇదీ పార్వతీపురం పురపాలక సంఘంలో అవినీతి బాగోతం. ఈ విషయాలన్నీ స్వయంగా ఆ శాఖ ఆర్డీ వద్దే బాధితులు మొరపెట్టుకోవడం గమనార్హం. మున్సిపల్‌ కమిషనర్‌ పై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో గురువారం ఆ శాఖ ఆర్డీ రవీంద్ర స్థానిక కార్యాలయంలో విచారణ చేపట్టారు. ఫిర్యాదుదారులను పిలిచి మాట్లాడారు. వీడియో చిత్రీకరణ ద్వారా ఈ ప్రక్రియ సాగింది. ప్రధానంగా ముగ్గురు వ్యక్తులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా విచారణ చేపట్టినట్లు తెలిసింది. కౌన్సిలర్ల ఆమోదం లేకుండా చేపట్టిన పనులు, ఆశీల పాటలో జరిగిన అవకతవకలు, మున్సిపల్‌ స్టాంప్‌ లేకుండా వసూళ్లకు పాల్పడుతున్నట్లు జి.వెంకటరమణ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. లేఅవుట్లో అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు గుర్తించినా.. కమిషనర్‌ చర్యలు తీసుకోలేదని టీడీపీ కౌన్సిలర్‌ కె.నారాయణ ఆరోపించారు. చింతాడ దయమణి అనే మహిళ తనకు నిరాశ్రయుల భవనం అనుమతి మంజూరు కోసం కమిషనర్‌ రూ.లక్ష డిమాండ్‌ చేశారని.. అంతకు ముందు కార్యాలయ సిబ్బందికే రూ.50 వేలు ఇచ్చానని తెలిపారు. ఇదే విషయం చెబితే.. ఎవరి డబ్బులు వారివే అన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

న్యూస్‌రీల్‌

ఉన్నతాధికారులకు నివేదిస్తాం..

విచారణ అనంతరం ఆర్డీ రవీంద్ర మీడియాతో మాట్లాడారు. ఫిర్యాదులను వీడియో ద్వారా రికా ర్డు చేశామని.. తదుపరి చర్యల నిమిత్తం పై అధి కారులకు నివేదికను పంపిస్తామని తెలిపారు.

శుక్రవారం శ్రీ 6 శ్రీ జూన్‌ శ్రీ 20251
1/2

శుక్రవారం శ్రీ 6 శ్రీ జూన్‌ శ్రీ 2025

శుక్రవారం శ్రీ 6 శ్రీ జూన్‌ శ్రీ 20252
2/2

శుక్రవారం శ్రీ 6 శ్రీ జూన్‌ శ్రీ 2025

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement