
వ్యాధుల పట్ల అప్రమత్తం
సీతంపేట: ఎపిడమిక్ సీజన్ ఆరంభమైందని, వ్యా దుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యసిబ్బందికి కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ సూచించారు. ఈ మేరకు గురువారం సీతంపేట ఏరియా ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. మలేరియా, వైరల్ ఫీవర్స్ తీవ్ర త, రోజువారీ ఓపీ, మందుల వివరాల గురించి సూపరెంటెండెంట్ బి.శ్రీనివాసరావును అడిగి తెలు సుకున్నారు. రోగులకు సరిపోయే బెడ్స్ ఉన్నా యా? లేదా? అని పరిశీలించారు. ఆస్పత్రి అంతా కలియదిరిగి ప్రతి వార్డు, డాక్డర్ గదులు, మౌలిక వసతుల సదుపాయం గురించి తెలుసుకున్నారు. అదనపు భవనాలు నిర్మాణ దశలో ఉన్నందున రెండునెలల్లో పూర్తి చేయాలని సంబంధిత అధికారుల ను ఆదేశించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఐటీఐని సందర్శించారు. జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో స్కిల్ హబ్లను ఏర్పాటు చేశామని, యువత సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. నైపుణ్యాభివృద్ధి శిక్షణ ద్వారా యువతకు ఉపాధి కల్పించనున్నట్లు తెలిపారు.
మారిషస్ ఫైనాపిల్ క్షేత్రం పరిశీలన..
సీతంపేట మండలంలోని బిల్లగూడ గ్రామంలో మారిషస్ ఏర్పాటు చేసిన పైనాపిల్ పంట క్షేత్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న రకం కాబట్టి గిరిజన ఉపప్రణాళిక పథకం కింద ఈ ఏడాది 358 మంది రైతులకు ఈ పైనాపిల్ పిలకలను సరఫరా చేశామన్నారు. రైతులకు ఆదా యం పెరగడంతో పాటు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అభిప్రాయ పడ్డారు. మార్కెట్ సౌకర్యాలు బాగుంటాయని, విదేశాల్లో మన పైనాపిల్కు గిరాకి ఉందన్నారు. ఐటీడీఏ పీఓ సి.యశ్వంత్కుమార్రెడ్డి, ఏపీవో చిన్నబాబు పాల్గొన్నారు.