
మళ్లీ రేషన్ తిప్పలు!
పార్వతీపురం టౌన్: ప్రజలకు 2019కు ముందు మాదిరి రేషన్ తిప్పలు మళ్లీ ప్రారంభమయ్యాయి. సరుకుల కోసం రేషన్ షాపుల వద్ద ప్రజలు గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటకీ గత్యంతరం లేక ప్రజలు వరుసలో ఉండాల్సిన పరిస్థితి. రేషన్ షాపు నుంచి సరుకులు తీసుకుంటున్న లబ్ధిదారులు అష్టకష్టాలు పడి వాటిని ఇంటికి తీసుకువెళ్తున్నారు. రేషన్ షాపులకు కొన్ని గ్రామాల్లో అర కిలోమీటరు, కిలోమీటరు దూరం వెళ్లాల్సిన పరిస్థితి. అయినప్పటకీ గత్యంతరం లేక అక్కడకే ప్రజలు వెళ్లాల్సిన పరిస్థితి. రేషన్ సరుకుల కోసమే ఒక రోజంతా కేటాయించాల్సిన పరిస్థితి.
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్లు (ఎండీయూ) వాహనాలను తీసుకొచ్చింది. వీటి ద్వారా ప్రజల ఇళ్ల వద్దకే వెళ్లి సరుకులు పంపీణి చేసింది. దీంతో ప్రజలకు ఎంతగానో సౌకర్యవంతంగా ఉండేది. వృద్ధులు, నడవలేని వారు ఇంటికే సరుకులు రావడంతో ఎంతో సంతోషించేవారు. ప్రజలకు ఉపయోగకరమైన ఎండీయూ వ్యవస్థను కూటమి సర్కార్ రద్దు చేసి ప్రజలను ఇక్కట్లు తెచ్చి పెట్టింది. దీంతో మళ్లీ రేషన్కు లబ్ధిదారులకు తిప్పలు తప్పడం లేదు.

మళ్లీ రేషన్ తిప్పలు!