
● స్కానింగ్ కోసం గర్భిణుల అవస్థలు ● ఘోషా ఆసుపత్రి నుంచ
విజయనగరం ఫోర్ట్ :
ఘోషా ఆసుపత్రిలో ప్రసవం కోసం వెళ్లిన గర్భిణులకు స్కానింగ్ కోసం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తీసుకువెళ్తున్నారు. ఇక్కడ సకాలంలో స్కానింగ్ జరగక గర్భిణులు గంటల తరబడి నిరీక్షించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గంటల తరబడి స్కానింగ్ కోసం గర్భిణులు ఉండాల్సి రావడంతో కొందరు తీవ్ర అసౌకర్యానికి గురై కన్నీరు పెట్టుకుంటున్నారు. అయినా అధికారులు తగు చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఘోషా ఆసుపత్రిలో అల్ట్రా సౌండ్ స్కానింగ్
యంత్రం ఉన్నా..
ఘోషా ఆసుపత్రిలో మాత, శిశువులకు వైద్య సేవలు అందిస్తారు. ఇక్కడ కూడా అల్ట్రా సౌండ్ యంత్రం ఉంది. అయినా రోగులను ప్రతీ రోజు స్కాన్ కోసం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి పంపిస్తున్నారు. దీంతో గర్భిణులు అక్కడ నుంచి సర్వజన ఆసుపత్రికి రావడానికి, స్కానింగ్ చేయించుకోవడానికి రెండు, మూడు గంటల సమయం పడుతుంది. దీంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలా ప్రతీ రోజు పది మంది వరకు గర్భిణులను సర్వజన ఆసుపత్రికి పంపిస్తున్నారు. ఇది ఒక నిత్య తంతుగా మారిపోయింది. దీనికి పరిష్కారం చూపించాల్సిన అధికారులు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. గర్భిణులకు అష్టకష్టాలు తప్పడం లేదు. గర్భిణుల కష్టాలు చూసిన వారు అయ్యో! అంటున్నారు. కానీ అధికారులు స్పందించడం లేదు.
రేడియాలిజిస్ట్ లేకే..
ఘోషా ఆసుపత్రిలో రేడియాలజిస్ట్ లేరు. గైనికాలజిస్ట్లు స్కానింగ్ను చేస్తున్నారు. వారికి ఎంత వర కు సాధ్యమవుతుందో అంతే చేస్తున్నారు. చేయ లేని పరిస్థితులు తలెత్తినప్పుడు ప్రభుత్వ సర్వజనఆసుపత్రికి రిఫర్ చేస్తున్నాం. ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ రేడియాలజిస్ట్ను ఘోషా ఆసుపత్రికి పంపించే ఏర్పాటు చేస్తున్నారు. రేడి యాలజిస్ట్ వస్తే ఘోషా ఆసుపత్రిలోనే స్కానింగ్ చేస్తాం. – డాక్టర్ అరుణశుభశ్రీ,
డిప్యూటీ సూపరింటెండెంట్, ఘోషాస్పత్రి