
సచివాలయానికి తాళం
చిత్రంలో మూసివేసి ఉన్నది కొమరాడ మండలంలోని గిరిశిఖర పంచాయతీ పూడేస్ గ్రామ సచివాలయం. గ్రామంలోని ఓ అద్దె భవనంలో సచివాలయం నిర్వహిస్తున్నారు. అయితే, సిబ్బంది నిత్యం అందుబాటులో ఉండకపోవడంతో పాటు నెట్వర్క్ సమస్యతో ఏ సేవ అందడం లేదు. శుక్రవారం ఒక్క ఉద్యోగి కూడా విధులకు హాజరుకాకపోవడంతో రేషన్కార్డు, కులధ్రువీకరణ పత్రాలు, ఆధార్ వంటి సేవల కోసం వచ్చిన వారు ఆందోళన చేశారు. సిబ్బంది తీరును నిరసిస్తూ తాళం వేశారు. ఉన్నతాధికారులు స్పందించి సచివాలయం సక్రమంగా తెరిచేలా చూడాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక సచివాలయ సేవలు సక్రమంగా అందడం లేదని వాపోయారు. – కొమరాడ