
జిల్లా కేంద్రం..
సోమవారం శ్రీ 26 శ్రీ మే శ్రీ 2025
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్న సదుద్దేశంతో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాల పునర్విభజన చేపట్టారు. అందులో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లాను ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలో పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పిస్తూ గిరిజన ప్రాంతాలను, జిల్లా కేంద్రాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. జిల్లా కేంద్రంలో కలెక్టరేట్, ప్రభుత్వ కార్యాలయాల సముదాయాలు, మున్సిపల్ పార్క్, తోటపల్లి ఐటీడీఏ పార్క్ ఏర్పాటుతో పాటు జిల్లా కేంద్రాన్ని సుందరంగా తీర్చిదిద్దారు.
నేడు పీజీఆర్ఎస్కు
హాజరు కానున్న జిల్లా కలెక్టర్
సీతంపేట: సీతంపేటలో సోమవారం జరగనున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ హాజరు కానున్నారని ఐటీడీఏ అధికార వర్గాలు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపాయి. గిరిజనులు తమ సమస్యలపై వినతులు సమర్పించవచ్చన్నారు.
1143 పోస్టులను డీఎస్సీ నుంచి మినహాయించాలి
సీతంపేట: గిరిజన గురుకులాల్లో భర్తీ చేయనున్న 1143 టీచర్ పోస్టులను డీఎస్సీ నుంచి మినహాయించాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్ ట్రైబుల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఎం నాయక్కు ఆదేశించినట్టు గిరిజన జేఏసీ నాయకుడు బి.ఉమామహేశ్వరరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గిరిజన గురుకులాల్లో అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన పని చేస్తున్న టీచర్లు జాతీయ ఎస్టీ కమిషన్కు ఈ విషయమై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు హైదరాబాద్ ఇటీవల వచ్చిన కమిషన్ సభ్యులను యూనియన్ నాయకులు కలిశారు. అంతకు ముందు ఢిల్లీలో పలుమార్లు కలిసి సమస్యలను వివరించారు. స్పందించిన కమిషన్ సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్లో పోస్టులు డీఎస్సీలో చూపించలేదని, గిరిజన గురుకులం అధికారులు గురుకుల పాఠశాలల్లో ఖాళీలు ఎందుకు చూపించారని ప్రశ్నించారు. గురుకులం బైలాస్కు విరుద్ధంగా అవుట్ సోర్సింగ్లో టీచర్స్ అండ్ లెక్చరర్స్ పోస్టులను భర్తీ చేసినందుకు అందరిని సీఆర్టీలుగా మార్పు చేయాలన్నారు. మూడు రోజుల్లో ఇది అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారన్నారు. ఇది తుది తీర్పు అన్నారు. లేదంటే కమిషన్ తగు చర్యలు తీసుకుంటుందన్నారు. కమిషన్ తీర్పుతో గిరిజన గురుకులాల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు న్యాయం జరుగుతుందని ఆదివాసీ జేఏసీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.
కీచక ఉపాధ్యాయుడు!
రేగిడి: మండలంలోని ఓ జెడ్పీ ఉన్నత పాఠశాలలో కీచక ఉపాధ్యాయుడి రాసలీలలు ఆలస్యంగా సామాజిక మాధ్యమాల ద్వారా ఆదివారం వెలుగులోకి వచ్చాయి. జెడ్పీ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికపై ఉపాధ్యాయుడు పాఠశాల పని చేసే రోజుల్లో కన్నేశాడు. మాయమాటలు చెప్పి లొంగదీసుకొని గర్భవతిని చేసినట్టు విశ్వసనీయ సమాచారం. బాలిక తండ్రి గతంలో మృతి చెందగా.. తల్లి వేరే చోట పనులకు వలసబాటు పట్టింది. దీంతో బాలిక తాత గారి ఇంటి వద్ద ఉంటూ జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుకుంటుంది. పాఠశాలకు వేసవి సెలవులిచ్చిన తరువాత బాలిక తల్లి వద్దకు వెళ్లింది. తల్లి తన బిడ్డ అనారోగ్యంతో బాధపడుతున్నట్టు గుర్తించింది. వెంటనే వైద్యులను సంప్రదించగా బాలిక గర్భం దాల్చినట్టు ఉందని చెప్పినట్టు సమాచారం. కుటుంబ పరువుకు సంబంధించిన విషయం కావడంతో బయటకు రానివ్వకుండా గోప్యం పాటించినట్టు సమాచారం.
పార్వతీపురం టౌన్: పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రం సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతోంది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక ఎన్నికల వేళ ఇచ్చిన ఏ ఒక్క హామీని జిల్లా కేంద్రంలో అమలు చేయకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. చినుకు పడితే జిల్లా కేంద్రంలోని ప్రజల కష్టాలు అన్నీఇన్నీ కావు. పట్టణ నడిబొడ్డు
డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారం సాధ్యమేనా..
పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రానికి ప్రధాన సమస్య అయిన డంపింగ్ యార్డును గత ప్రభుత్వం ఆర్కె.బట్టివలస గ్రామ సమీపంలో తరలించేందుకు చర్యలు చేపట్టింది. అందుకు తగ్గ ప్రణాళికలు రూపొందించింది. ఎన్నికల కోడ్ కారణంగా నిలిచిపోయిన డంపింగ్ యార్డు సమస్య పరిష్కారం కాలేదు. డంపింగ్ యార్డును తరలిస్తామని కూటమి ఎమ్మెల్యే విజయచంద్ర హామీ ఇచ్చి రెండు నెలల్లో పరిష్కారం చూపుతామని చెప్పి సంవత్సరం గడుస్తున్నా పట్టణ ప్రధాన సమస్య అయిన డంపింగ్ యార్డుకు పరిష్కారం చూపకపోవడంతో పట్టణ వాసుల్లో నిరుత్సాహం నెలకొంది.
గెడ్డ వర్షం వస్తే చాలు పట్టణంలో పలు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. ఎన్నికల ముందు పట్టణానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మిస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే విజయచంద్ర కనీసం పట్టించుకోవడం లేదని పట్టణ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నపాటి వర్షం పడితే చాలు పట్టణంలో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులకు గురికావడమే కాకుండా ముంపు ప్రాంతాలైన బైపాస్ కాలనీ వాసులు భయబ్రాంతులకు గురవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. వరహాల గెడ్డ ఆక్రమణలు, పూడికలు తీయకపోవడంతో మండలంలో కురిసిన వర్షానికి పట్టణంలో పలు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. ఇళ్లలోకి వర్షపు నీరు చేరి ఇబ్బందులు పడుతున్నారు. ఏడాది కావస్తున్నా వరహాల గెడ్డలో పూడికలు తీయకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వీటిపై చర్యలు చేపట్టి తమను ఆదుకోవాలని పట్టణ వాసులు కోరుతున్నారు.
తూతూ మంత్రంగా ‘స్వచ్ఛ పార్వతీపురం’
పట్టణంలోని పలు వార్డుల్లో పూడికలు తీయకపోవడం, చెత్త ఎక్కువగా పేరుకుపోవడంతో పట్టణ వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తూతూ మంత్రంగానే నిర్వహిస్తున్నట్టు పట్టణ వాసులు వాపోతున్నారు. పట్టణంలోని కొత్తవలస, వైకెఎం కాలనీ, గూడ్స్షెడ్ రోడ్డు, ఇందిరా కాలనీ,
శాశ్వత పరిష్కారం చూపాలి
పట్టణంలోని తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. ప్రస్తుత వేసవి కాలంలో నాలుగైదు రోజులకొకసారి కుళాయి ద్వారా తాగునీటిని విడుదల చేస్తున్నారు. తాగునీటి సమస్యకు పరిష్కారం చూపుతామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చి శాశ్వత పరిష్కారం చూపాలి.
– సూర్ల ఉమామహేశ్వరి,
గూడ్స్షెడ్ రోడ్డు, పార్వతీపురం
ముంపు నుంచి తప్పించాలి
మాది బైపాస్ కాలనీ, మా కాలనీలో వర్షం పడితే చాలు ఇళ్లలోకి వర్షపు నీరు చేరుతుంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో క్రమం తప్పకుండా వరహాలగెడ్డ పూడికలు తీయించేవారు. ఏడాది గడుస్తున్నా గెడ్డలో పూడికలు తీయడం లేదు. వర్షం పడితే మా కాలనీలోని ఇళ్లలో వర్షపు నీరు చేరుతుంది. అధికారులు స్పందించి తక్షణమే చర్యలు చేపట్టాలి.
– ఎన్.మహేశ్వరరావు, బైపాస్ కాలనీ
జగన్నాథపురం కాలనీల కాలువల్లో పూడికలు పేరుకుపోయి దోమల బెడద పెరిగిందని ఆ కాలనీవాసులు వాపోతున్నారు. వార్డుల్లో కాలువలు తీసి రోగాలు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.
డంపింగ్ యార్డుకు
పరిష్కారం చూపాలి
పార్వతీపురం పట్టణ ప్రధాన సమస్య అయిన డంపింగ్ యార్డును తరలిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. ప్రస్తుతం అధికారం చేపట్టి ఏడాది కావస్తున్నా పట్టించుకొనే నాధుడే కరువయ్యారు. గతంలో ప్రతిపాదించిన విధంగా డంపింగ్ యార్డును పట్టణం నుంచి దూర ప్రాంతాలకు తరలించి చెత్త నుంచి పట్టణానికి విముక్తి కల్పించాలి.
– ఎస్.అనిల్, పార్వతీపురం పట్టణం
నుంచి వెళ్లే వరహాల గెడ్డ సమస్యకు పరిష్కారం లేదు. తాగునీటి కష్టాలు తప్పడం లేదు. పారిశుధ్య చర్యలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. డంపింగ్ యార్డు తరలింపు లేదు. ఈ సమస్యలన్నింటినీ అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లో పరిష్కరిస్తామని చెప్పిన ఎమ్మెల్యే నేడు ఏడాదవుతున్నా పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు.
వరహాల గెడ్డకు మోక్షమెప్పుడో..
జిల్లా కేంద్రం నడిబొడ్డున ప్రవహిస్తున్న వరహాల
● కొండంత కష్టం!
ఈ చిత్రంలో కొండ రహదారుల్లో ఉన్న ఓ ఖానాపై అనారోగ్యంతో దుప్పటి కప్పుకొని పడుకుని ఉన్న యువతి పేరు సవర విజయశాంతి. వారం రోజుల కిందట సీతంపేట మండలం గుమ్మడ గ్రామం నుంచి బంధువుల ఇంటికి రేగుమానుగూడ వచ్చింది. రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతుంది. ఆదివారం చలి జ్వరం తీవ్రం కావడంతో ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు 108కి కుటుంబ సభ్యులు ఫోన్ చేశారు. అయితే గ్రామ రహదారి పూర్తిగా రాళ్లు తేలి ఉండడంతో 108 వాహనం గ్రామానికి వచ్చే పరిస్థితి లేదు. దీంతో విజయశాంతిని బంధువులు గ్రామం నుంచి కొంత దూరం తీసుకువచ్చి ఇలా ఖానాపై పడుకోబెట్టారు. 108 వాహనం వచ్చే వరకు సపర్యలు చేశారు. కాసేపటికి 108 వాహనం రావడంతో సీతంపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు.
– సీతంపేట
న్యూస్రీల్
నాడు...
నేడు...
కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి సంవత్సరం గడుస్తున్నా జిల్లాను అభివృద్ధి చేసే దాఖలాలు కన్పించడం లేదు. ఎన్నికల ముందు ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర పట్టణానికి దశాబ్దాల కాలం నాటి సమస్య అయిన డంపింగ్ యార్డు తరలిస్తామని హామీ ఇచ్చారు. అధికారం చేపట్టి దాదాపు 12 నెలలు కావస్తున్నా హామీ ఊసే ఎత్తడం లేదు. ఎన్నికల నాటి హామీలు విస్మరించారని, పట్టణ అభివృద్ధిపై దృష్టి సారించడం లేదని పట్టణ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మురికి కూపంలా వరహాలగెడ్డ
వర్షం కురిస్తే రహదారులు, ఆర్టీసీ కాంప్లెక్స్ జలమయం
బైపాస్ కాలనీ వాసులకు తప్పని అవస్థలు
దశాబ్దాల డంపింగ్ యార్డు తరలింపు ఉత్తిదేనా!

జిల్లా కేంద్రం..

జిల్లా కేంద్రం..

జిల్లా కేంద్రం..