ఆ కమిషనర్‌ మాకొద్దు! | - | Sakshi
Sakshi News home page

ఆ కమిషనర్‌ మాకొద్దు!

May 1 2025 1:24 AM | Updated on May 1 2025 1:24 AM

ఆ కమిషనర్‌ మాకొద్దు!

ఆ కమిషనర్‌ మాకొద్దు!

● ప్రోటోకాల్‌ పాటించరు.. సమావేశాలూ పెట్టరు ● పార్వతీపురం పురపాలక సంఘంలో వింత పోకడ ● పుర అధికారి తీరుపై చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌ల అసంతృప్తి ● వైఎస్సార్‌సీపీ సభ్యులను పట్టించుకోవడం లేదని ఆవేదన

సాక్షి, పార్వతీపురం మన్యం:

పార్వతీపురం పురపాలక సంఘంలో కమిష నర్‌ తీరుపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఆయన ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని.. సభ్యులుగా తమను ఎటువంటి కార్యక్రమాలకూ పిలవడం లేదు సరికదా.. కనీసం ప్రోటోకాల్‌ కూడా పాటించడం లేదని స్వయంగా మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌, పలువురు కౌన్సిలర్లు వాపోవడం గమనార్హం. 30 వార్డులున్న పార్వతీపురం పుర పాలక సంఘం పరిధిలో గత స్థానిక ఎన్నికల్లో 22 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది. 18వ వార్డుకు చెందిన బోను గౌరీశ్వరి చైర్‌ పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో పలువురు వైఎస్సార్‌సీపీ సభ్యులు వెన్నుపోటు రాజకీయాలకు తెర తీసి, కూటమిలోకి గో డ దూకారు. రాజకీయ నేతలంటే.. అవసరాలు, ఇతర పనుల కోసం పార్టీలు మార్చారంటే అర్థం ఉంది. అధికారులు సైతం అదే తోవన వెళ్తున్నారని.. పార్వతీపురం పురపాలక సంఘంలో ఎప్పటి నుంచో వినిపిస్తోంది. ప్రధానంగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్‌సీపీ సభ్యుల పట్ల వివక్షత ప్రారంభమైంది. చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌ల మాట కూ విలువ లేకుండా పోయిందని పలుమార్లు వారు బహిరంగంగానే వాపోయిన సందర్భాలున్నాయి. ప్రధానంగా ప్రస్తుత కమిషనర్‌ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. కూటమి ఎమ్మెల్యే కనుసన్నల్లోనే ఆయన పని చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

సమావేశాలు నిర్వహించాలన్నా స్పందన శూన్యం..

ప్రస్తుతం పార్వతీపురం మున్సిపాలిటీలో అనేక సమస్యలు రాజ్యమేలుతున్నాయి. పారిశుద్ధ్య పరి స్థితి అధ్వానంగా ఉంది. తాగునీటి ఎద్దడి రోజురోజుకూ తీవ్రమవుతోంది. చెరువులు, ఖాళీ స్థలా లు కబ్జాకు గురవుతున్నాయి. ఈ నేపథ్యంలో సమస్యలపై చర్చించేందుకు, నిధుల కేటాయింపునకు ఒక వేదిక ఉండడం లేదు. సాధారణ, బడ్జెట్‌ సమావేశాలు పెట్టాలని వైఎస్సార్‌సీపీ చైర్‌పర్సన్‌ బోను గౌరీశ్వరి, వైస్‌ చైర్మన్‌ యిండుపూరు గున్నేశ్వరరావు, పాలకవర్గ సభ్యులు చాలా రోజులుగా కోరుతున్నారు. కమిషనర్‌ నుంచి స్పందన ఉండటం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిశాక సమావేశాలు నిర్వహించిన దాఖలా లేవు. పలు వార్డుల్లో, ప్రజల ఎదుర్కొంటున్న పలు సమస్య లను కమిషనర్‌ దృష్టికి దాదాపు 20 రోజుల క్రితం తీసుకెళ్లారు. వాటిని పరిష్కరించాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదు. తమకు కనీ స గౌరవం కూడా ఇవ్వడం లేదని, ప్రోటోకాల్‌ పాటించడం లేదని చైర్‌పర్సన్‌ వాపోతున్నారు. రెండు రోజుల క్రితం ఆమె పత్రికాముఖంగా తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ.. కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌ దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు.

పార్వతీపురం మున్సిపాలిటీ, ఇక్కడి ప్రజల సమస్యలు తీరాలంటే కమిషనర్‌ను తక్షణం మార్చాలి. ఈ కమిషనర్‌ వల్ల ఏ పనులూ జరగడం లేదు. ఆయన ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. సమస్యల మీద మాట్లాడాలని వస్తే మూడు, నాలుగు గంటలైనా వేచి ఉంచుతున్నారు గానీ రావడం లేదు. మా మున్సిపాలిటీకి మంచి కమిషనర్‌ను ఇవ్వాలని కలెక్టర్‌ను, ఉన్నతాధికారులను కోరుతున్నాం.

– బోను గౌరీశ్వరి, చైర్‌పర్సన్‌, పార్వతీపురం మున్సిపాలిటీ

పార్వతీపురం బాగుపడాలంటే కమిషనర్‌ను మార్చాల్సిందే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement