
అకాల వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
పార్వతీపురంటౌన్: అకాల వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాల ని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ అధికారులను ఆదేశించారు. వాతావ రణ శాఖ సూచనల మేరకు జిల్లా అధికారులతో బుధవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రానున్న మూడు రోజుల్లో భారీ పర్షాలు కురిసే అవకాశం ఉందని, గాలులు 60 కిలో మీటర్ల వేగంతో వీస్తాయ ని వాతావరణ శాఖ సూచించిందన్నారు. ఈ మేరకు సంబంధిత అధికారులు తగు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించే ప్రదేశాల్లోని ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. తాగునీ రు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
శ్యామలాంబ పండగ ఏర్పాట్ల పరిశీలన
సాలూరు: పట్టణంలో శ్యామలాంబ పండగ ఏర్పాట్లను ఎస్పీ మాధవ్రెడ్డి బుధవారం పరిశీలించారు. ముందుగా అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం సిరిమాను రథోత్సవం ఏర్పాట్లపై పోలీసులు, ఉత్సవ కమిటీ సభ్యులతో చర్చించారు. శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా ప్రజలందరూ సంతోషంగా, ప్రశాంతంగా పండగ జరుపుకోవాలని కోరా రు. కార్యక్రమంలో పాలకొండ ఇన్చార్జి డీఎస్పీ రాంబాబు, పట్టణ, రూరల్ సీఐలు అప్పలనాయుడు, రామకృష్ణ, ఎస్ఐలు వెంకటసురేష్, వెంకటరమణ, దేవదాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
స్పందించిన సర్వజన ఆస్పత్రి వైద్యాధికారులు
విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఎక్స్రే ఫిల్మ్లు లేక ఎం.ఎల్.సి రోగులు అవస్థలు పడుతున్న అంశంపై ‘ఎంఎల్సీ రోగులకు తిప్పలు’ అనే శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన వార్తకు ఆస్పత్రి వైద్యాధికారులు స్పందించారు. ప్రస్తుతం ఉన్న ఎక్సరే, సిటీ, ఎంఆర్ఐ ఫిల్మ్లు రోగులకు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సంబంగి అప్పలనాయుడు తెలిపారు.
నేడు కార్మికులకు సెలవు
విజయనగరం గంటస్తంభం: ప్రపంచ కార్మిక దినోత్సవం మే డే రోజున కార్మికులకు సెలవు దినంగా ప్రకటించాలి. ఒకవేళ యజమానులు ఆ రోజున పనిచేయించుకుంటే 30 రోజులలోపు ఏదో ఒకరోజు సెలవు ఇవ్వాలి. ఆ రోజుకు రెట్టింపు వేతనం కార్మికులకు ఇవ్వాల్సి ఉంటుందని కార్మికశాఖ జిల్లా ఉప కమిషనర్ ఎస్.డి.వి.ప్రసాదరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఐటీఐ విద్యార్థులకు
అప్రెంటిస్ అవకాశాలు
విజయనగరం అర్బన్: జిల్లాలో ఐటీఐ కోర్సు లు పాసైన విద్యార్థులకు మైలాన్ లేబొరేటరీ పరిశ్రమలో అప్రెంటిస్ కల్పించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని విజయనగరం ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ టీవీగిరి ఒక ప్రకటనలో తెలిపారు. ఐటీఐలో ఎలక్ట్రీషియన్/ఫిట్టర్ కోర్సులు పాసైన విద్యార్థులకు విజయనగరం బయోటెక్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ 2వ తేదీన కన్వీనర్ ప్రభుత్వ ఐటీఐ విజయనగరం కార్యాలయానికి ధ్రువపత్రాలతో హాజరుకావాలని కోరారు. పూర్తి వివరాల కోసం సెల్: 98491 18075 నంబర్ను సంప్రదించాలన్నారు.

అకాల వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి