
వైఎస్సార్ సీపీ అరకు పార్లమెంట్ పరిశీలకుడిగా బొడ్డేడ ప
ఏయూక్యాంపస్: వైఎస్సార్ సీపీ అరకు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడిగా గవర కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డేడ ప్రసాద్ నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకురాలిగా మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి, శ్రీకాకుళం పార్లమెంట్ పరిశీలకుడిగా ఎమ్మెల్సీ కుంభా రవిబాబు, విజయనగరం పార్లమెంట్ పరిశీలకుడిగా కిల్లి సత్యనారాయణ నియమితులయ్యారు. వీరు పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్లకు అనుసంధానంగా పనిచేస్తారు.
గిరిజన అభ్యర్థులకు ప్రత్యేక డీస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలి
జియ్యమ్మవలస: గిరిజన అభ్యర్థులకు ప్రత్యేక డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని గిరిజన డీఎస్సీ సాధన కమిటీ డిమాండ్ చేసింది. మే 2వ తేదీన మన్యం బంద్కు ఆదివాసీ గిరిజన సంఘం సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సురేంద్ర తెలిపారు. రావాడలో మంగళవారం నిర్వహించిన గిరిజన సంఘ సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం నారా చంద్రబాబునాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఏజెన్సీలో స్పెషల్ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మెగా డీఎస్సీ నోటిఫికేషన్లో ఆదివాసీ ప్రాంతం మొత్తం 882 పోస్టుల్లో 45 మాత్రమే గిరిజనులకు దక్కుతాయని, గిరిజన అభ్యర్థులు నష్టపోతారన్నారు. కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం మన్యం జిల్లా సహాయ కార్యదర్శి కె.రామస్వామి, కె.సీతారాం, పి.తిరుపతి, మండల అధ్యక్ష, కార్యదర్శులు జి.సోమయ్య, ఎ.రామారావు పాల్గొన్నారు.
ఒడిశావైపు వెళ్లిన ఏనుగులు
భామిని: మండలంలోని నేరడి–బి, బిల్లుమడ గ్రామాల మధ్య తిష్టవేసిన ఏనుగులు వంశధార నది దాటి ఒడిశా వైపు వెళ్లాయి. ఒడిశాలోని వన్న–గౌరి గ్రామాల మధ్య పంట పొలాల్లో సంచరిస్తున్నాయి. ఏనుగుల జాడను అటవీశాఖ అధికారులు, టేకర్స్ గమనిస్తున్నారు.

వైఎస్సార్ సీపీ అరకు పార్లమెంట్ పరిశీలకుడిగా బొడ్డేడ ప

వైఎస్సార్ సీపీ అరకు పార్లమెంట్ పరిశీలకుడిగా బొడ్డేడ ప