
అప్పుకిందే రూ.2కోట్లు
● పండగ కోసం ప్రత్యేక గ్రాంటు కాదు.. ● స్పష్టం చేసిన మున్సిపల్ అధికారులు ● శ్యామలాంబ పండగ పనులకు కౌన్సిల్ ఏకగ్రీవ తీర్మానం
సాలూరు:
పట్టణంలో శ్యామలాంబ పండగ నిర్వహణ కోసం మున్సిపాలిటీ నుంచి ఖర్చు చేస్తున్న 2 కోట్ల రూపాయలు ప్రభుత్వ గ్రాంటు కాదని, మున్సిపాలి టీలకు అప్పు రూపేణా మంజూరైన నిధులని అధికారులు స్పష్టంచేశారు. మున్సిపల్ చైర్పర్సన్ పువ్వల ఈశ్వరమ్మ అధ్యక్షతన కమిషనర్ కృష్ణారా వు ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన మున్సిపల్ ప్రత్యేక సర్వసభ్య సమావేశం వాడీవేడిగా జరిగింది. ముందుగా మున్సిపాలిటీకి రూ.2కోట్లు మంజూరయ్యాయని, ఆ నిధులపై స్పష్టత ఇవ్వాలని మున్సిపల్ వైస్ చైర్మన్ వంగపండు అప్పలనాయు డు, కౌన్సిలర్లు గిరిరఘు, రాపాక మాధవరావు, బి. శ్రీనివాసరావు తదితరులు అధికారులను ప్రశ్నించా రు. దీనిపై మున్సిపల్ డీఈ ప్రసాద్ మాట్లాడుతూ, రాష్ట్రంలో 40 మున్సిపాలిటీలకు నిధులు మంజూరయ్యాయని, అందులో సాలూరు మున్సిపాలిటిటీ రూ.2 కోట్లు మంజూరైనట్టు తెలిపారు. ఇది అప్పు కింద మంజూరు చేశారని, మున్సిపాలిటీలో నిధు లు ఉన్నప్పుడు తిరిగి ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. కౌన్సిలర్లుకు తెలపకుండా పైలెట్ వాటర్స్కీమ్లు మంజూరుపై అధికారులను పలువురు నిలదీశారు. 25వ వార్డులో ఉన్న తాగునీటి పథకాలను రూ.2లక్షలతో మరమ్మతులు చేపడితే సమస్య పరిష్కారమయేదన్నారు. దోమల నివారణ చర్యలు చేపట్టకపోవడంపై కౌన్సిలర్ పాండ్రంకి సన్యాసమ్మ నిలదీశారు. పట్టణంలో వైభవ్ జ్యూయలర్స్ అనుమతులపై కౌన్సిలర్లు ప్రశ్నించా రు. శ్యామలాంబ పండగ నేపథ్యంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని తీర్మానించారు. పలు అభివృద్ధి పనులపై చర్చించి, అజెండాలోని పలు అంశాలకు ఆమోదం తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జర్జాపు దీప్తి, అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.