
గజగజ..!
సోమవారం శ్రీ 28 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
మన్యం
మందులు అందుబాటులో ఉన్నాయి
పీహెచ్సీల్లో అన్ని రకాల వ్యాధులకు మందులు అందుబాటులో ఉన్నాయి. మరికొద్ది రోజుల్లో వైద్యాధికారి పోస్టులు కూడా భర్తీ అవుతాయి. ఐటీడీఏ పీఓ ఆదేశాల మేరకు డీఎంవో ఆధ్వర్యంలో మలేరియాపై వైద్య సిబ్బందికి పీహెచ్సీల వారిగా ప్రత్యేకంగా అవ గాహన సమావేశాలు ఏర్పాటు చేయనున్నాం.
– విజయపార్వతి, డిప్యూటీ డీఎంహెచ్వో, సీతంపేట
సీతంపేట: మన్యంలో అధిక ఉష్ణోగ్రతలు, ఆపై ఉక్కపోత జనాలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఈ క్రమంలో మన్యంలో జ్వర పీడితుల కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. వీరితో ఏజెన్సీ పీహెచ్సీలు కిటకిటలాడుతున్నాయి. జిల్లాలో రోజు రోజుకు ఎండలు భగభగమంటున్నాయి. తెల్లారింది మొదలు, రాత్రి వరకు వేడి గాలులతో ప్రజలు అల్లాడుతున్నారు. 40 నుంచి 42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో ప్రజలు ఆందోళనకు గురౌతున్నారు. వైరెల్, టైఫాయిడ్ జ్వరాలు ప్రబలుతుండడంతో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు జ్వరాలతో వచ్చేవారి సంఖ్య అధికమౌతుంది. మారుమూల ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో 80 నుంచి వంద వరకు రోజూ వివిధ రకాల కేసులు వస్తుండగా వాటిలో 20 వరకు జ్వరాలే ఉంటున్నాయి. స్థానిక ఏరియా ఆసుపత్రిలో అయితే ప్రతీ రోజు వంద నుంచి 150 వరకు ఓపీ ఉండగా సోమవారం వారపు సంత రోజున దాదాపు 350 వరకు ఓపీ నమోదు కావడం గమనార్హం.
ఏజెన్సీలో కొండలపై ఉన్న గ్రామాల్లో బోర్లు, బావులు, గెడ్డలు అడుగంటడం, కొన్ని గ్రామాలకు కొండకోనల్లో ఎక్కడో ఉన్న ఊట జలాలను గిరిజనులు తాగుతుండడంతో టైఫాయిడ్ జ్వరాలు నమోదవుతున్నాయి. దోనుబాయి, మర్రిపాడు, కుశిమి, సీతంపేట, కడగండి, కిల్లాడ, దారపాడు, పొల్ల, చిన్నబగ్గ, సోమగండి, గొయిది, కుడ్డపల్లి, పెద్దగూడ, శంభాం, కుడ్డపల్లి, మండ తదితర పంచాయతీల పరిధిలో ఏజెన్సీలో ఎక్కువగా జ్వర పీడిత కేసులు నమోదవుతున్నాయి.
మలేరియా షరా మామూలే...
ఏజెన్సీలో మలేరియా కేసులు కూడా నమోదవుతున్నాయి. ఈ సంవత్సరం ఇప్పటి వరకు 72 మలేరియా కేసులు నమోదైనట్టు మలేరియా శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ సంఖ్య ఇంకా రెట్టింపు ఉంటుందనేది అంచనా. ప్రైవేటు ఆసుపత్రులు, క్లినిక్లలో వస్తున్న మలేరియా పాజిటివ్ కేసుల గూర్చి బయటకు తెలియడం లేదు. కేవలం ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తున్న రోగులను మాత్రమే లెక్కల కింద చూపుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఎండా కాలం మధ్యలో వాతావరణం మార్పులు చోటు చేసుకోవడం, అకాల వర్షం కురియడం వంటివి జరుగుతుంటాయి. ఇటువంటి సమయంలో నీరు నిల్వ ఉన్నచోట దోమలు స్వైర విహారం చేస్తాయి. మలేరియాకు కారణమయ్యే ప్లాస్మోడియం పరాన్నజీవి ఆడ ఎనాఫిలిస్ దోమ ద్వారా వ్యాపిస్తుంది. ఇవి మురుగునీటి కాలువలు, చెరువులు, కుంటలు, వద్ద ఎక్కువగా పెరుగుతాయి. చాలా వేగంగా ఎదుగుతూ రాత్రి సమయంలో కుడతాయి. దీంతో మలేరియా రోగం సోకే ప్రమాదముంది.
న్యూస్రీల్
తీవ్రంగా వెద్య సిబ్బంది కొరత
కొన్ని పీహెచ్సీల్లో ఇద్దరు వైద్యాధికారులు ఉండాల్సి ఉంది. అయితే పీజీ చేయడానికి కొందరు వెళ్లిపోవడంతో ఆ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సీతంపేట ఐటీడీఏ పరిధిలో 31 పీహెచ్సీల్లో 11 వైద్యాధికారి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మిగతా 20 మంది పని చేస్తుండగా నెల రోజుల కిందట వీరిలో పీజీ కోర్సులు నిమిత్తం 9 మంది వెళ్లారు. ఇంకా వాటిని భర్తీ చేయాల్సి ఉంది. దోనుబాయి, కుశిమి, మర్రిపాడు తదితర చోట్ల ఒక్కొక్క వైద్యాధికారే విధులు నిర్వహిస్తున్నారు. స్థానిక ఏరియా ఆసుపత్రిలో నాలుగు పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
పెరుగుతున్న జ్వర పీడితులు
నమోదవుతున్న మలేరియా, వైరల్, టైఫాయిడ్ కేసులు
కిటకిటలాడుతున్న ఏజెన్సీ పీహెచ్సీలు
వైద్యుల కొరతతో తప్పని అవస్థలు

గజగజ..!

గజగజ..!

గజగజ..!