
● తాగునీటి కష్టాలు
గుమ్మలక్ష్మీపురం మండలం రాయగడ జమ్ము పంచాయతీ చినరావికోన గ్రామ గిరిజనులు కొద్ది రోజులుగా తాగునీటి కష్టాలు పడుతున్నారు. గ్రామంలో 76 కుటుంబాలకు నీటి సౌకర్యం కల్పించేందుకు గెడ్డ చెలమకు అనుసంధానంగా ఏర్పాటు చేసిన గ్రావటీ వాటర్ స్కీం నుంచి కొన్నాళ్లుగా నీటి సరఫరా నిలిచిపోయింది. వేసవి ఎండల ధాటికి గెడ్డ చలమలోని నీరు ఇంకిపోవడంతో వాటర్ స్కీం నుంచి నీరు ఆగిపోయింది. దీంతో గ్రామానికి దిగువన ఉన్న పాములగీసాడ సమీపంలోని గెడ్డ చెలమ వద్దకు కొండ దిగి నీటిని సేకరించి మళ్లీ కొండపైకి వెళ్తారు. గిరిజనులు తాగునీటి కష్టాలు ఇటు పాలకులకుగాని, అధికారులకుగాని పట్టడం లేదు. – గుమ్మలక్ష్మీపురం