పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత | - | Sakshi
Sakshi News home page

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

Jun 6 2025 6:07 AM | Updated on Jun 6 2025 6:07 AM

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

జిల్లా కలెక్టర్‌ పి.అరుణ్‌ బాబు

నరసరావుపేట: పర్యావరణ పరిరక్షణ ప్రతిఒక్కరి బాధ్యత అని జిల్లా కలెక్టర్‌ పి.అరుణ్‌బాబు పేర్కొన్నారు. మనతో మనం మమేకం అవడం యోగా అయితే, ప్రకృతితో మమేకం అవడం ‘హరిత యోగా’ అని పర్యావరణ దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్‌ పి.అరుణ్‌బాబు, ఎస్పీ కంచి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు గురువారం పరేడ్‌ గ్రౌండ్స్‌ రోడ్డులో వనమహోత్సవం నిర్వహించి మొక్కలు నాటారు. యోగాంధ్ర, వనమోత్సవం కార్యక్రమాలకు హాజరైన వారితో డీఎఫ్‌ఓ (సామాజిక అడవులు) అశోక్‌ వనమహోత్సవం, ప్రపంచ పర్యావరణ దినోత్సవ ప్రతిజ్ఞను చేయించి పర్యావరణాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. డీఆర్‌ఓ ఏకా మురళి, జిల్లా అటవీ అధికారి కృష్ణప్రియ, ఆర్డీకె కె.మధులత, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

నీటిశుద్ధి ప్లాంట్‌కు 20ఎకరాలు సేకరించండి

నరసరావుపేట: నాగార్జునసాగర్‌ వద్ద నీటిశుద్ధి ప్లాంట్‌ ఏర్పాటుకు అవసరమైన 20 ఎకరాల భూమిని త్వరగా ఏర్పాటుచేసి రానున్న రెండేళ్లలో ప్లాంట్‌ పూర్తిచేసేందుకు సహకరించాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి సంస్థ జాయింట్‌ సెక్రటరీ లాల్‌ చంద్రమా, టెక్నికల్‌ ఆఫీసర్‌ జగజిత్‌సింగ్‌ సోది జిల్లా కలెక్టర్‌ను కోరారు. గురువారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ పి.అరుణ్‌బాబు అధ్యక్షతన గ్రామీణ నీటి సరఫరా పారిశుధ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా నీటిశుద్ధి, పారిశుధ్య మిషన్‌ సమావేశం నిర్వహించారు. జిల్లాలో చేపడుతున్న జలజీవన్‌ మిషన్‌ వివరాలు పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా కలెక్టర్‌ వారికి వివరించారు. ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఈ అనంతరాజ్‌, ద్వామా పీడీ సిద్ధలింగమూర్తి, డీఎఫ్‌ఓ అశోక్‌కుమార్‌, డీపీఓ నాగేశ్వర్‌ నాయక్‌, ఎన్‌ఎస్‌పీ ఈఈ కృష్ణమోహన్‌, ఏడీఏ రవికుమార్‌, డీఎల్‌డీఓ వెంకటరెడ్డి, భూగర్భజల అధికారి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement