వాహనం ఢీకొని వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

వాహనం ఢీకొని వ్యక్తి మృతి

Jun 2 2025 2:01 AM | Updated on Jun 2 2025 2:01 AM

వాహనం ఢీకొని వ్యక్తి మృతి

వాహనం ఢీకొని వ్యక్తి మృతి

దాచేపల్లి: అతివేగంగా వస్తున్న గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతిచెందిన సంఘటన ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని ఇందిరాకాలనీకి చెందిన కొమ్మా విజయ్‌కుమార్‌(58)తన ఇంటి నుంచి హైవే రోడ్డు దాటుతున్నాడు. ఈ క్రమంలో పిడుగురాళ్ల వైపు నుంచి అతివేగంగా వస్తున్న వాహనం అతనిని ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికులు సంఘటన స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై జీ. పాపారావు సంఘటన స్థలాన్ని పరిశీలన చేశారు. ఢీకొట్టిన వాహనం కోసం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడి భార్య భార్య విమల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై పాపారావు తెలిపారు. పొస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని గురజాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement