బ్రాహ్మణ బాలురు దరఖాస్తు చేసుకోండి | - | Sakshi
Sakshi News home page

బ్రాహ్మణ బాలురు దరఖాస్తు చేసుకోండి

May 1 2025 1:54 AM | Updated on May 1 2025 1:54 AM

బ్రాహ

బ్రాహ్మణ బాలురు దరఖాస్తు చేసుకోండి

అమరావతి: విజయవాడ పరిసర ప్రాంత కళాశాలల్లో ఇంటర్‌ నుంచి ఆ పై చదువులు చదువుతున్న విద్యార్థులు హాస్టల్‌లో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తుమ్మలపల్లి అన్నపూర్ణమ్మ బ్రాహ్మణ బాలుర విద్యార్థి వసతి గృహం అధ్యక్షుడు జంధ్యాల శంకర్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడ గవర్నరుపేట, పెద్దిబొట్లవారివీధి, ఏలూరురోడ్డులోని శ్రీమతి తుమ్మలపల్లి అన్నపూర్ణమ్మ బ్రాహ్మణ బాలుర విద్యార్థి వసతి గృహంలో విద్యార్థులకు ఉచిత వసతి, భోజన సదుపాయం కల్పిస్తామన్నారు. గుంటూరు, తెనాలి, గుడివాడ ప్రాంతాల పరిధిలోని కళాశాలల్లో చదువుచున్న విద్యార్థినులకు ఉపకార వేతనాలు ఇస్తామని తెలిపారు. స్కాలర్‌ షిప్‌నకు దరఖాస్తు చేసుకునే విద్యార్థినులు వసతి గృహ కార్యాలయంలోగానీ, 8309012282, 9848044152 నెంబర్లలో గానీ సంప్రదించాలని తెలిపారు.

మ్యూజియంలను

అభివృద్ధి చేయాలి

విజయపురిసౌత్‌: ప్రపంచ పర్యాటక కేంద్రాలైన నాగార్జునకొండ, అమరావతి, చంద్రగిరిలలోని మ్యూజియంలను అభివృద్ధి చేయాలని అఖిల భారత పంచాయతీ పరిషత్‌ (న్యూఢిల్లీ) జాతీయ ఉపాధ్యక్షుడు, అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్‌ డాక్టర్‌ జాస్తి వీరాంజనేయులు బుధవారం భారత ప్రభుత్వ కేంద్ర పురావస్తుశాఖ అదనపు డైరెక్టర్‌ జనరల్‌ ఆనంద్‌ మద్కర్‌ను ఢిల్లీలో కలిసి విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ పర్యాటకులు తరుచూ ఈ మ్యూజియంలను సందర్శిస్తున్నారని కానీ వారు ఇక్కడ గైడ్స్‌ సదుపాయం లేక ఈ ప్రాంతాల చరిత్రను తెలుసుకోలేకపోతున్నారన్నారు. ఈ మ్యూజియంలలో డిస్‌ప్లే బోర్డ్స్‌, లైటింగ్‌ గ్యాలరీలను అభివృద్ధి చేయాలని కోరారు. దీనికి స్పందించిన ఆనంద్‌ మద్కర్‌ మ్యూజియాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని త్వరలో తగు అభివృద్ధి చర్యలు చేపడతామని చెప్పినట్లు వీరాంజనేయులు తెలిపారు.

సాగర్‌ నీటిమట్టం

విజయపురిసౌత్‌: నాగార్జున సాగర్‌ జలాశయ నీటిమట్టం బుధవారం 514.20 అడుగుల వద్ద ఉంది. ఇది 138.9118 టీఎంసీలకు సమానం.

బ్రాహ్మణ బాలురు  దరఖాస్తు చేసుకోండి 
1
1/1

బ్రాహ్మణ బాలురు దరఖాస్తు చేసుకోండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement