
హోరాహోరీగా ఎడ్ల బల ప్రదర్శన పోటీలు
దాచేపల్లి:రాష్ట్రస్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు సోమవారం హోరాహోరీగా జరిగాయి. నాలుగు పళ్ల విభాగంలో సూర్యాపేట జిల్లా మఠంపల్లికి చెందిన గాదె ఆషేర్ సుమణ్విరెడ్డి, ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు, తుర్లపాడుకి చెందిన పోపూరి ఆదినారాయణ సంయుక్త ఎడ్లజత 5,059 అడుగుల దూరం బండ లాగి మొదటిస్థానంలో నిలిచాయి. నంద్యాల జిల్లా గడివేముల మండలం గడిగరేవుల గ్రామానికి చెందిన పెరుమళ్ల సంజయ్కుమార్ ఎడ్ల జత 4,932 అడుగుల దూరం లాగి రెండవ స్థానం, గుంటూరు జిల్లా పెదకాకాని మండలం తక్కెళ్లపాడుకి చెందిన మోపర్తి నవీన్కుమార్ చౌదరి ఎడ్లజత 4,500 అడుగుల దూరం లాగి మూడవ స్థానం, పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం కేసానుపల్లికి చెందిన కావ్యనంది బ్రీడింగ్బుల్స్ సెంటర్ నెల్లూరి రామకోటయ్య ఎడ్లజత 4,432 అడుగుల దూరం బండలాగి నాల్గవ స్థానంలో నిలిచాయి. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం విస్పపాలేనికి భాష్వికారెడ్డి, జ్ఞాన్విత్ రెడ్డి ఎడ్లజత 4,312 అడుగుల దూరం లాగి ఐదవ స్థానం, పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం భీమవరానికి చెందిన పసుమర్తి దివ్యశ్రీ ఎడ్ల జత 3,850 అడుగుల దూరం లాగి ఆరవ స్థానం, బాపట్ల జిల్లా ఇంకొల్లు మండలం పూసపాడుకి చెందిన ఏలూరి లిఖితచౌదరి ఎడ్లజత 3,750 అడుగుల దూరం లాగి ఏడవ స్థానం, బాపట్ల జిల్లా యద్దనపూడి మండలం యద్దనపూడికి చెందిన మేసీ్త్ర ఖాదర్మస్తాన్ ఎడ్ల జత 3,316 అడుగుల దూరం లాగి ఎనిమిదో స్థానంలో నిలిచాయి.విజేతలైన ఎడ్ల జతల రైతులకు దాతలు బహుమతులు, నగదు ప్రదానం చేశారు. పోటీలకు న్యాయనిర్ణేతగా గూడా శ్రీనివాసరావు వ్యవహరించారు. కమిటీ సభ్యులు కొప్పుల గిరి, యలమల నరేష్, అనిశెట్టి శ్రీనివాసరావు, మునగా నిమ్మయ్య, కానుకొల్లు ప్రశాంత్ పర్యవేక్షించారు.