
మాచర్ల మున్సిపల్ వైస్ చైర్మన్గా మదార్ సాహెబ్
మాచర్ల: మాచర్ల పురపాలక సంఘం వైస్ చైర్మన్గా టీడీపీకి చెందిన మదార్ సాహెబ్ ఎన్నికయ్యారు. సోమవారం ఉదయం పురపాలక సంఘ కార్యాలయంలో ఎన్నిక జరిగింది. గురజాల ఆర్డీఓ మురళీకృష్ణ, జాయింట్ కలెక్టర్ జి.సూరజ్లు ఎన్నికల అధికారులుగా వ్యవహరించారు. ఎన్నికకు 21 మంది కౌన్సిలర్లు హాజరయ్యారు. వీరంతా మదార్ సాహెబ్ పేరును ప్రతిపాదించగా, ఏకగ్రీవంగా మదార్ను ఎన్నకున్నారు. మున్సిల్ వైస్ చైర్మన్గా మదార్ సాహెబ్ ఎన్నికై నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.
బెదిరింపులు, ప్రలోభాలు..
మాచర్ల పట్టణంలో 31 వార్డులు ఉన్నాయి. నాలుగు సంవత్సరాల కిందట జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ 31 వార్డులు కై వసం చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఒకరి తరువాత మరొకరిని పార్టీ మారాలని అనేక రకాలుగా ఒత్తిళ్లు, ప్రలోభాలాకు గురిచేయడంతోపాటు, గతంలో పెట్టుకున్న బిల్లులు కూడా ఆపుతామని బెదిరించారు. దీంతో మొదట దఫా పది మంది కౌన్సిలర్లు టీడీపీలోకి వెళ్లారు. అనంతరం మరో ఆరుగురిని లాక్కున్నారు. 16 మందితో పది నెలల క్రితం మున్సిపల్ వైస్ చైర్మన్గా పోలూరి నరసింహారావును ఎంపిక చేసుకుని, అంతకు ముందు ఉన్న ఇన్చార్జి చైర్మన్, వైస్ చైర్మన్ మాచర్ల చిన్న ఏసోబుతో రాజీనామా చేయించారు. అప్పటి నుంచి ఒకరితరువాత మరొకరిని బెదిరింపులు, ప్రలోభాలకు గురిచేస్తూ సోమవారం నాటికి టీడీపీ కూటమి 21 మంది కౌన్సిలర్లను తమ వైపు మల్చుకుని వైస్చైర్మన్ గెలిపించుకుని సంబరాలు జరుపుకొన్నారు. మదార్సాహెబ్ను పలువురు అభినందించారు. సత్తెనపల్లి డీఎస్పీ హనుమంతరావు, మాచర్ల అర్బన్ సీఐ ప్రభాకరరావు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.