
అర్జీల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ
నరసరావుపేట: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో వచ్చే అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్కు అధ్యక్షత వహించి ప్రజల నుంచి 168 అర్జీలను స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ వచ్చిన ప్రతి అర్జీకి అర్థవంతమైన సమాధానం ఇస్తూ ఆయా శాఖల అధికారులు సత్వరం పరిష్కరించేలా ప్రత్యేక శ్రద్ద చూపాలని ఆదేశించారు. జేసీ గనోరే సూజర్ ధనుంజయ, డీఆర్ఓ మురళి, అధికారులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు
పీజీఆర్ఎస్లో 168 అర్జీలు స్వీకరణ