
పల్నాడు
ఆదివారం శ్రీ 27 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
దరఖాస్తు గడువు
I
ప్రిన్సిపల్ జడ్జిని కలిసిన కలెక్టర్
నరసరావుపేట: స్థానిక కోర్టు ప్రాంగణానికి శనివారం విచ్చేసిన గుంటూరు జిల్లా ప్రిన్సిపల్ జడ్జి సాయికల్యాణ చక్రవర్తిని జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు మర్యాద పూర్వకంగా కలిశారు.
డాగ్ స్క్వాడ్తో తనిఖీలు
నరసరావుపేటటౌన్: కశ్మీర్లో ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో రాష్ట్ర పోలీసులు అప్రమత్తం అయ్యారు. పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శనివారం వన్టౌన్, టూటౌన్ పోలీసులు రైల్వేస్టేషన్, ఆర్టీసీ బస్టాండ్, షాపింగ్మాల్స్, లాడ్జీల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పోలీస్ జాగిలాలతో కలిసి పరిసరాలంతా తిరిగి పరిశీలించారు. లాడ్జిల్లో బస చేసినవారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. షాపింగ్ మాల్, లాడ్జీల నిర్వాహకులతో మాట్లాడి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానస్పద వ్యక్తుల సంచారంపై పోలీస్ శాఖకు సమాచారం అందజేయాలని సీఐలు ఎం.వి.చరణ్, హైమారావు సూచించారు.
బుద్ధిష్ట్ సర్క్యూట్ వద్ద అగ్నిప్రమాదం
అమరావతి: అమరావతిలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో బుద్ధ విగ్రహాం ఎదురుగా కోట్లాది రూపాయలతో నిర్మించిన బుద్ధిష్ట్ సర్క్యూట్ భవనాల వద్ద శనివారం అగ్నిప్రమాద జరిగింది. పర్యాటక శాఖ మేనేజర్ మణికుమార్ అందించిన సమాచారం మేరకు ఓ ప్రైవేటు ఊరేగింపులో కాల్చిన బాణసంచా రవ్వలు బుద్ధిష్ట్ సర్క్యూట్ భవనాల సమీ పంలో ఉన్న చెత్తలో పడి రాజుకుని మంటలు చెలరేగాయి. ఇది గమనించిన స్థానికులు మంటలు అర్పటానికి ప్రయత్నించినా సాధ్యపడలేదు. సత్తెనపల్లి అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వటంతో అగ్నిమాపక వాహనం, సిబ్బంది చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చారు. కోట్లాది రూపాయల భవనాలకు ఎటువంటి నష్టం జరగలేదు.
నరసరావుపేట ఈస్ట్: తమ పిల్లలను ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో చేర్పించి చదివించాలనేది నిరుపేద, మధ్య తరగతి తల్లిదండ్రుల ఆశ. అందుకు వారి ఆర్థిక పరిస్థితి అనుకూలించదు. అయితే పేదల ఆశలకు విద్యాహక్కు చట్టం–2009 అండగా నిలుస్తోంది. ప్రతి ప్రైవేటు, కార్పొరేట్, అన్ఎయిడెడ్ పాఠశాలల్లో 25 శాతం సీట్లు ఒకటో తరగతిలో పేదలకు కేటాయించాలని చట్టంలోని సెక్షన్ 12(1)(సీ) స్పష్టం చేస్తోంది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. పాఠశాల విద్యాశాఖాధికారులకు సైతం ఖచ్చితమైన ఆదేశాలు అందటంతో ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం ఉచిత సీట్ల భర్తీపై ప్రత్యేక దృష్టి సారించారు.
ప్రభుత్వమే ఫీజు చెల్లిస్తుంది
విద్యాహక్కు చట్ట ప్రకారం పేద పిల్లలకు 1వ తరగతిలో 25 శాతం సీట్లు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రైవేటు యాజమాన్యాల పాఠశాలలకు ఆదేశాలు జారీ చేయటంతోపాటు అవి అమలయ్యేలా చూడాలని విద్యాశాఖాధికారులను ఆదేశించింది. జిల్లాలో 371 ప్రైవేటు యాజమాన్యాలలో నడిచే పాఠశాలలు ఉన్నాయి. ఒక్కో పాఠశాలలో కనీస స్థాయిలో సీట్లు భర్తీ చేసినా దాదాపు 4వేల మంది పేద పిల్లలు లబ్ధి పొందుతారు. 1వ తరగతిలో ప్రవేశం పొందిన విద్యార్థికి 8వ తరగతి వరకు ఫీజులను ప్రభుత్వమే చెల్లిస్తుంది. ప్రైవేటు పాఠశాలలకు చెల్లించాల్సిన ఫీజులను నిర్ణయించేందుకు ప్రభుత్వం ఇప్పటికే కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ నివేదిక ఆధారంగా నిర్ణయించిన ఫీజును ప్రభుత్వం విద్యార్థులు ప్రవేశం పొందిన పాఠశాలలకు నేరుగా చెల్లిస్తుంది.
అర్హత వయస్సు
సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ సిలబస్ను అనుసరిస్తున్న పాఠశాలల్లో ప్రవేశాలకు ఏప్రిల్ 2, 2019 నుంచి మార్చి 31, 2020 మధ్య జన్మించి 5 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి. అలాగే స్టేట్ సిలబస్ అనుసరిస్తున్న పాఠశాలల్లో ప్రవేశాలకు జూన్ 2, 2019 నుంచి మే 31, 2020 మధ్య జన్మించి 5 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి.
ఎంపిక విధానం
విద్యార్థుల ఎంపికను పారదర్శకంగా చేపట్టేలా పాఠశాల విద్యాశాఖ చర్యలు తీసుకుంటోంది. అర్హులైన పేదలు సీఎస్ఈ వెబ్పోర్ట్లో ఆన్లైన్లో దరఖాస్తు చేయటం మొదలు ఎంపిక ప్రక్రియ, సీట్ల కేటాయింపు అంతా పారదర్శంగా కొనసాగుతుంది. దరఖాస్తులను www.cse. ap.gov.in వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే సమీపంలోని సచివాలయం, మండల విద్యాశాఖాధికారి కార్యాలయం, మీసేవా, ఇంటర్నెట్ సెంటర్ల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసేందుకు నివాస ధ్రువీకరణ, విద్యార్థి జనన ధ్రువీకరణ పత్రాలు, దివ్యాంగులైతే వైకల్యం సర్టిఫికెట్, హెచ్ఐవీ బాధితులైతే సంబంధిత మెడికల్ సర్టిఫికెట్, వార్షిక ఆదాయం, కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి. ఆయా ధ్రువీకరణ పత్రాల ఆధారంగా ప్రాధాన్యతా క్రమంలో పారదర్శకంగా ఎంపిక పూర్తి చేస్తారు. ఆధార్తో లింక్ చేయబడి దరఖాస్తులో పేర్కొన్న మొబైల్ ఫోన్కు ఎస్ఎంఎస్ ద్వారా ఎంపికై న విద్యార్థుల వివరాలు అందచేస్తారు. పట్టణ ప్రాంతాలలో రూ.1.44 లక్షలు, గ్రామీణ ప్రాంతాలలో రూ. 1.20 లక్షలు వార్షిక ఆదాయంగా నిర్ణయించారు. ఎంపికలో దరఖాస్తులో పొందుపరిచిన చిరునామా ఆధారంగా పాఠశాల సమీపంలోని విద్యార్థులకు మొదట సీట్లు కేటాయిస్తారు.
న్యూస్రీల్
ఆయా పాఠశాలల్లో 25శాతం సీట్లు కేటాయింపు ఒకటి నుంచి 8వ తరగతి వరకు ఉచిత విద్య జిల్లాలో 371 ప్రైవేటు పాఠశాలలు రేపటి నుంచి దరఖాస్తుల స్వీకరణ మే 15 తుది గడువు
సీట్ల కేటాయింపు ఇలా...
ప్రైవేటు, కార్పొరేట్, అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో 2025–26 విద్యాసంవత్సరానికి 1వ తరగతిలో 25 శాతం సీట్లు ప్రతి పాఠశాల కేటాయించాలి. ఇందులో 5 శాతం సీట్లు ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న వర్గాలు (దివ్యాంగులు, అనాథలు, హెచ్ఐవీ బాధిత పిల్లలు)కు కేటాయించారు. మరో 10 శాతం ఎస్సీలకు, 4 శాతం ఎస్టీలకు, మిగిలిన 6 శాతం సీట్లు బలహీన వర్గాలకు చెందిన బీసీ, మైనారిటీ, ఓసీ (ఆదాయం ఆధారంగా) వర్గాలకు కేటాయించారు.
విద్యాహక్కు చట్టం–2009 ద్వారా 2025–26 విద్యా సంవత్సరానికి గాను ప్రైవేటు పాఠశాలల్లో చేరేందుకు ఈనెల 28వ తేదీ నుంచి మే 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చిన దరఖాస్తులను ప్రాధాన్యతా క్రమంలో పరిశీలించి మే 24వ తేదీన మొదటి విడత ఫలితాలను ప్రకటించి ఎంపికై న విద్యార్థుల తల్లిదండ్రుల మొబైల్ఫోన్లకు సందేశం అందిస్తారు. తొలి విడత పాఠశాలల ప్రవేశాల నిర్థారణను జూన్ 2వ తేదీ నాటికి పూర్తి చేస్తారు. రెండవ విడత ఫలితాలను జూన్ 6వ తేదీన ప్రకటించి పాఠశాలల్లో ప్రవేశాల నిర్థారణను జూన్ 12వతేదీ నాటికి పూర్తి చేస్తారు. పేద విద్యార్థులకు విద్యాహక్కు చట్టం ద్వారా కేటాయించిన 25శాతం సీట్ల అవకాశాన్ని తల్లిదండ్రులు వినియోగించుకోవాలి జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ తెలిపారు.

పల్నాడు

పల్నాడు

పల్నాడు

పల్నాడు

పల్నాడు

పల్నాడు

పల్నాడు