
మెరుగైన వైద్యసేవలే లక్ష్యం
శ్రీకాకుళం: జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు మరో ముందడుగు పడిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం రిమ్స్కు బోయింగ్ ఇండియా సంస్థ (సీఎస్ఆర్) ద్వారా సమకూర్చిన రూ.45 లక్షల విలువైన వైద్య పరికరాలను కేంద్రమంత్రి శుక్రవారం ప్రారంభించారు. అనంతరం రిమ్స్ ఆసుపత్రి, కళాశాల అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గొండు శంకర్, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, బోయింగ్ ఇండియా వైద్యులు ప్రవీణ్, రంజిత్, అమృత, రోహిత్, జీజిహెచ్, రిమ్స్ వైద్యుడు మురళీకృష్ణ, సూపరింటెండెంట్ డాక్టర్ అమూల్య, జైన్ తదితరులు పాల్గొన్నారు.