
వైభవంగా శ్రీముఖలింగేశ్వరుని కల్యాణోత్సవం
జలుమూరు: ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీముఖలింగంలో పాంచరాత్రి కల్యాణ ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం పార్వతీ పరమేశ్వరుల కల్యాణ ఉత్సవం ఘనంగా జరిగింది. గణపతి పూజతో ప్రారంభించి స్వామివారికి ప్రత్యేక పూజలు, ఏకవార అభిషేకాలు నిర్వహించారు. ముత్తయిదువులు కొట్నం దంపు కార్యక్రమం నిర్వహించారు. అంతకుముందు స్వామివారికి ప్రత్యేకంగా అలంకరించి క్షీరాభిషేకం జరిపించారు. అనంతరం ఉత్సవమూర్లును నంది వాహనంపై ఉంచి తిరువీధి ఉత్సవం నిర్వహించారు. భక్తులు హారతిలిస్తూ పార్వతి పరమేశ్వరులను దర్శించుకున్నారు. ఈఓ పి.ప్రభాకరరావు ఎంపీటీసీ కె.హరిప్రసాద్, సర్పంచ్ టి.సతీష్కుమార్ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.

వైభవంగా శ్రీముఖలింగేశ్వరుని కల్యాణోత్సవం