
బ్రిడ్జి నిర్మించారు.. రోడ్డు మరిచారు..!
రాయగడ: జిల్లాలోని కెరడ సమితి పరిధిలోని కిలిమిసిగుడ గ్రామస్తులు రాకపొకలకు నానా అవస్థలు పడుతున్నారు. ఈ గ్రామ ప్రజలు సమితి కేంద్రానికి రావాలంటే మధ్యలోని నాగావళి నదిని దాటుకుంటూ వెళ్లాల్సిందే. అయితే గ్రామస్తులు అవస్థలను దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం బ్రిడ్జి నిర్మాణం పనులు చేపట్టింది. అయితే బ్రిడ్జి పనులు పూర్తయి రెండేళ్లు గడుస్తున్నా అందుకు సంబంధించి ఇంతవరకు అప్రోచ్ రోడ్డు పనులు చేపట్టక పొవడంతో గ్రామస్తుల రాకపోకలు నరకంగా మారాయి. వర్షాకాలం ముందుగా రోడ్డు పనులు పూర్తి చేయకపొతే వీరికి నరకయాతన తప్పదు. అధికారులు స్పందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.