
సతొబిసిలో ఏనుగుల బీభత్సం
రాయగడ: నియమగిరి పర్వత ప్రాంతాల్లో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. శనివారం అర్ధరాత్రి గ్రామంలో చొరబడిన ఏనుగుల గుంపు ఇళ్లలో ప్రవేవించి సామగ్రిని ధ్వంసం చేస్తున్నాయి. గ్రామంలో గల గొపినాథ్ జకసిక ఇంటిలో చొరబడిన ఏనుగులు అతను నిల్వ ఉంచుకున్న చోడి, ధాన్యం బస్తాలను బయటకు తీసుకువెళ్లి ధ్వంసం చేశాయి. గత కొద్ది రోజులుగా ఏనుగులు ఈ ప్రాంతంలో సంచరిస్తున్న సంగతి అటవీ శాఖ అధికారులకు తెలిసినప్పటికీ ఇంతవరకు వాటిని తోలే ప్రయత్నం చేయకపొవడంతో అవి గ్రామాల్లోకి చొరబడి బీభత్సాన్ని సృష్టిస్తున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు చొరవ తీసుకుని వాటిని తరమాలని కోరుతున్నారు.

సతొబిసిలో ఏనుగుల బీభత్సం