సతొబిసిలో ఏనుగుల బీభత్సం | - | Sakshi
Sakshi News home page

సతొబిసిలో ఏనుగుల బీభత్సం

Jun 2 2025 12:13 AM | Updated on Jun 2 2025 12:13 AM

సతొబి

సతొబిసిలో ఏనుగుల బీభత్సం

రాయగడ: నియమగిరి పర్వత ప్రాంతాల్లో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. శనివారం అర్ధరాత్రి గ్రామంలో చొరబడిన ఏనుగుల గుంపు ఇళ్లలో ప్రవేవించి సామగ్రిని ధ్వంసం చేస్తున్నాయి. గ్రామంలో గల గొపినాథ్‌ జకసిక ఇంటిలో చొరబడిన ఏనుగులు అతను నిల్వ ఉంచుకున్న చోడి, ధాన్యం బస్తాలను బయటకు తీసుకువెళ్లి ధ్వంసం చేశాయి. గత కొద్ది రోజులుగా ఏనుగులు ఈ ప్రాంతంలో సంచరిస్తున్న సంగతి అటవీ శాఖ అధికారులకు తెలిసినప్పటికీ ఇంతవరకు వాటిని తోలే ప్రయత్నం చేయకపొవడంతో అవి గ్రామాల్లోకి చొరబడి బీభత్సాన్ని సృష్టిస్తున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు చొరవ తీసుకుని వాటిని తరమాలని కోరుతున్నారు.

సతొబిసిలో ఏనుగుల బీభత్సం 1
1/1

సతొబిసిలో ఏనుగుల బీభత్సం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement