
తెలుగు భాషాభివృద్ధికి కృషి
జయపురం/కొరాపుట్: తెలుగు భాషాభివృద్ధికి కృషి చేస్తున్నామని వక్తలు అన్నారు. జయపురం తెలుగు సాంస్కృతిక సమితి నిర్వహణలో కొనసాగుతున్న జయపురం సిటీ ఉన్నత పాఠశాల వార్షికోత్సవం సోమవారం సాయంత్రం 6.30 నుంచి రాత్రి పది గంటల వరకు ఉత్సాహంగా కొనసాగింది. తెలుగు సాంస్కృతిక సమితి అధ్యక్షుడు బిరేష్ పట్నాయక్ అధ్యతన జరిగిన కార్యక్రమంలో అతిథులకు ప్రధానోపాధ్యాయుడు ప్రతాప్ కుమార్ పట్నాయక్ స్వాగతం పలికారు. తెలుగు సాంస్కృతిక సమితి అధ్యక్షులు బిరేష్ పట్నాయక్ మాట్లాడుతూ.. తెలుగు సాంస్కృతిక సమితి పెద్దల ఉద్యమంతో 1981లో తెలుగు బాలికల కోసం తెలుగు సాంస్కృతిక సమితి తెలుగు మాధ్యమ ఉన్నత పాఠశాలను నెలకొల్పిందని గుర్తు చేశారు. అనంతరం 2014లో ఆంగ్ల భాష మాధ్యమంలో కూడా ఉన్నత పాఠశాల ఏర్పాటు జరిగిందని వెల్లడించారు. సమాజంలో అట్టడుగు వర్గాల విద్యార్థులకు విద్య నేర్పేందుకు ఈ పాఠశాల ఏర్పడిందన్నారు. తెలుగు విద్యాబోధనలో సమతి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఆనాటి సమితి నిర్వాహకులు అవదానం వలన పాఠశాల నెలకొందన్నారు. పాఠశాలను మరింత అభివృద్ధి చేసేందుకు కృత నిశ్చయంతో ఉన్నామన్నారు. అతిథులుగా సిటీ ఉన్నత పాఠశాల పరిశీలన కమిటీ అధ్యక్షులు ఎ.శ్రీనివాసరావు, తెలుగు సాంస్కృతిక సమితి కార్యదర్శి వై.శ్రీనివాస ఖన్నా, పాఠశాల వ్యవస్థాపక సభ్యులు శశిభూషణ పట్నాయక్, సిటీ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు బి.సుజాత, సిటీ ఎంఈ, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు ఎం.మాధవి, సిటీ ఆంగ్ల మాధ్యమ పాఠశాల ప్రిన్సిపాల్ సుధాకర పట్నాయక్ పాల్గొన్నారు. ఉత్తమ విద్యార్థులకు ప్రొఫెషనల్, భాస్కర అవార్డులు ప్రదానం చేశారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన శాసీ్త్రయ, జానపద, సంబల్పురి, ఒడిస్సీ నృత్యాలు, తెలుగు సంప్రదాయ డ్యాన్స్లు ఆహూతులను అలరించాయి.
సిటీ ఉన్నత పాఠశాల వార్షికోత్సవంలో వక్తలు
సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించిన విద్యార్థులు

తెలుగు భాషాభివృద్ధికి కృషి

తెలుగు భాషాభివృద్ధికి కృషి