అటు వెలుగులు.. ఇటు చీకట్లు.. | - | Sakshi
Sakshi News home page

అటు వెలుగులు.. ఇటు చీకట్లు..

Jun 8 2025 1:14 AM | Updated on Jun 8 2025 1:14 AM

అటు వ

అటు వెలుగులు.. ఇటు చీకట్లు..

డిచ్‌పల్లి: మండల కేంద్రంలోని నాగ్‌పూర్‌ రైల్వే గేట్‌ నుంచి నడిపల్లి, బర్ధిపూర్‌, ధర్మారం(బి), మాధవనగర్‌ మీదుగా బోర్గాం (పి) వరకు ప్రధాన రహదారి మధ్యలో డివైడర్లను నిర్మించి మధ్యలో మొక్కలతోపాటు లైట్లు అమర్చారు. లైట్ల నిర్వహణ బాధ్యతను నుడా (నిజామాబాద్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ) పర్యవేక్షిస్తోంది. డివైడర్‌ మధ్యలో మొక్కలకు నీళ్లు పెట్టడం, ఎండిపోయిన మొక్కల స్థానంలో కొత్తవి నాటి సంరక్షించడం వంటి పనులు నుడా ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. అయితే లైట్లను మాత్రం ఆయా గ్రామ పంచాయతీలకు వదిలేశారు. అయితే అటు నుడా, ఇటు గ్రామ పంచాయతీలు లైట్ల నిర్వహణను పట్టించుకోవడం లేదు. నడిపల్లి గ్రామ పరిధిలో లైట్లు 24 గంటలు వెలుగుతుంటే.. బర్ధిపూర్‌ పరిధిలోని కార్ల షోరూముల నుంచి నిజాంసాగర్‌ కాలువ వరకు లైట్లు వెలుగక రోడ్డు చీకటిగా ఉంటోంది. రాత్రి పూట వాహనదారులు చీకట్లో ప్రయాణిస్తూ ఇబ్బందులు పడుతున్నారు.

అటు వెలుగులు.. ఇటు చీకట్లు..1
1/1

అటు వెలుగులు.. ఇటు చీకట్లు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement